ఈ నెలాఖరు బాక్సాఫీస్ కు చాలా కీలకం కానుంది. ఎందుకంటే ఉగాది, రంజాన్ పండగలు రెండూ ఒకేసారి రావడమే కాక పాంచ్ పటాకా టైపు లో అయిదు సినిమాలు థియేటర్లకు విచ్చేస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంటుందని ఎగ్జిబిటర్లు ఎదురు చూస్తున్నారు. తేదీల ప్రకారం చూసుకుంటే ముందుగా మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ మార్చి 27 దిగుతోంది. భాషల సంగతి పక్కనపెడితే అడ్వాన్స్ బుకింగ్స్ షాకిచ్చే రేంజ్ లో జరుగుతున్నాయి. మలయాళం వెర్షన్ అమ్మకాలు భీభత్సంగా ఉండగా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు కంటెంట్ మీద నమ్మకంతో ఏపీ, తెలంగాణలో మంచి రిలీజ్ కు సహకరిస్తున్నారు.
అదే రోజు విక్రమ్ ‘వీరధీరశూర పార్ట్ 2’ వస్తోంది. బజ్ పరంగా వెనుకబడినప్పటికీ మూవీ చూసాక సర్ప్రైజ్ అవుతారని టీమ్ నమ్ముతోంది. మార్కెటింగ్ పరంగా తమిళ్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు కాని టాక్ బాగుంటే మన ఆడియన్స్ కూడా చూస్తారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇక మరుసటి రోజు మార్చి 28 నితిన్ ‘రాబిన్ హుడ్’ మీద పెద్ద అంచనాలే ఉన్నాయి. నితిన్ కామెడీ టైమింగ్, కేతిక శర్మ ఐటెం సాంగ్, శ్రీలీల గ్లామర్, డేవిడ్ వార్నర్ క్యామియో, వెంకీ కుడుముల హాస్యం వెరసి అన్నివర్గాలను టార్గెట్ చేసుకుని వస్తోంది. మైత్రి ప్రొడక్షన్ కావడం వల్ల పెద్ద ఎత్తున మార్కెటింగ్ తో ఆడియన్స్ కి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ‘మ్యాడ్ స్క్వేర్’ మీద యూత్ లో హైప్ తెలిసిందే. పైన చెప్పిన వాటికంటే హైదరాబాద్ లాంటి నగరాల్లో వేగంగా బుకింగ్స్ జరుగుతోంది ఈ సినిమాకే. వెరైటీ ఇంటర్వ్యూలతో మెల్లగా అంచనాలు పెంచేస్తున్నారు. తమన్ బిజిఎం రూపంలో మరో ఆకర్షణ తోడయ్యింది. తర్వాత రెండు రోజుల గ్యాప్ తో సల్మాన్ ఖాన్ ‘సికందర్’ వచ్చేస్తాడు. ఇప్పటిదాకా టీజర్, పాటలు, ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచలేదు కానీ మాస్ మసాలా సరిగ్గా కుదిరితే భాయ్ రికార్డులు కొట్టేస్తాడు. కాకపోతే హిందీ వెర్షన్ ఒకటే కాబట్టి దీని ప్రభావం మల్టీప్లెక్సుల వరకు ఎక్కువగా ఉంటుంది. చూడాలి మరి ఎవరు విన్నర్సో ఎవరు లూజర్సో.
This post was last modified on March 24, 2025 1:42 pm
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ…
ఐతే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లే ఉంటుంది బాక్సాఫీస్ వ్యవహారం. సంక్రాంతికి ఒకేసారి అయిదు సినిమలు రిలీజయ్యాయి. కానీ తర్వాతి…
ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ…
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…