కరోనాకు చిన్నా పెద్దా, రాజు పేద అనే తేడాలేమీ లేవని పలుమార్లు రుజువైంది. డబ్బుకు లోటు లేని, అత్యుత్తమ వైద్య సదుపాయం పొందగల ఉన్నత స్థాయి వ్యక్తులు కరోనా ధాటికి నిలవలేకపోయారు. ప్రాణాలు కోల్పోయారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా ధాటికి మృత్యు వాత పడ్డారు. గత నెలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాకు బలయ్యారు. ఇటీవలే మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి, ఆయన భార్య సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరో రాజశేఖర్ కరోనాతో పోరాడుతున్నారని, ఆయన్ని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారని వార్తలు రాగానే అభిమానులు కంగారు పడిపోయారు. ఆయనకు ఏమీ కాకూడదని ప్రార్థనలు చేశారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఆ ప్రార్థనలు ఫలించినట్లే ఉన్నాయి.
రాజశేఖర్ ఔట్ ఆఫ్ డేంజర్ అన్నది ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆయన ఇంకో రెండు రోజుల్లో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు వచ్చే అవకాశాలున్నట్లు రాజశేఖర్ సతీమణి జీవిత వెల్లడించారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారని.. రోజు రోజుకూ ఆరోగ్యం మెరుగు పడుతోందని ఆమె చెప్పారు. రాజశేఖర్ ఒంట్లో అన్ని ఇన్ఫెక్షన్లూ తగ్గినట్లే అని కూడా ఆమె వెల్లడించారు. కొన్ని పరీక్షల తర్వాత రెండు రోజుల్లో ఐసీయూ నుంచి రాజశేఖర్ను బయటికి పంపే అవకాశాలున్నట్లు ఆమె వెల్లడించారు.
కొన్ని వారాల కిందట రాజశేఖర్, జీవితలతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లూ కరోనా బారిన పడ్డారు. ముందుగా కూతుళ్లిద్దరూ కరోనా నుంచి కోలుకోగా.. రాజశేఖర్, జీవిత ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందారు. జీవిత కొన్ని రోజుల కిందటే కరోనా నుంచి కోలుకున్నారు. రాజశేఖర్ పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే కనిపించింది. ఇప్పుడు ఆయన కూడా కోలుకుంటున్నారన్న వార్త అభిమానులకు ఉపశమనమే.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…