కరోనాకు చిన్నా పెద్దా, రాజు పేద అనే తేడాలేమీ లేవని పలుమార్లు రుజువైంది. డబ్బుకు లోటు లేని, అత్యుత్తమ వైద్య సదుపాయం పొందగల ఉన్నత స్థాయి వ్యక్తులు కరోనా ధాటికి నిలవలేకపోయారు. ప్రాణాలు కోల్పోయారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా ధాటికి మృత్యు వాత పడ్డారు. గత నెలలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం కరోనాకు బలయ్యారు. ఇటీవలే మాజీ మంత్రి నాయని నర్సింహారెడ్డి, ఆయన భార్య సైతం కరోనాతోనే ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరో రాజశేఖర్ కరోనాతో పోరాడుతున్నారని, ఆయన్ని ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారని వార్తలు రాగానే అభిమానులు కంగారు పడిపోయారు. ఆయనకు ఏమీ కాకూడదని ప్రార్థనలు చేశారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే ఆ ప్రార్థనలు ఫలించినట్లే ఉన్నాయి.
రాజశేఖర్ ఔట్ ఆఫ్ డేంజర్ అన్నది ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆయన ఇంకో రెండు రోజుల్లో ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు వచ్చే అవకాశాలున్నట్లు రాజశేఖర్ సతీమణి జీవిత వెల్లడించారు. ఆయన వేగంగా కోలుకుంటున్నారని.. రోజు రోజుకూ ఆరోగ్యం మెరుగు పడుతోందని ఆమె చెప్పారు. రాజశేఖర్ ఒంట్లో అన్ని ఇన్ఫెక్షన్లూ తగ్గినట్లే అని కూడా ఆమె వెల్లడించారు. కొన్ని పరీక్షల తర్వాత రెండు రోజుల్లో ఐసీయూ నుంచి రాజశేఖర్ను బయటికి పంపే అవకాశాలున్నట్లు ఆమె వెల్లడించారు.
కొన్ని వారాల కిందట రాజశేఖర్, జీవితలతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లూ కరోనా బారిన పడ్డారు. ముందుగా కూతుళ్లిద్దరూ కరోనా నుంచి కోలుకోగా.. రాజశేఖర్, జీవిత ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందారు. జీవిత కొన్ని రోజుల కిందటే కరోనా నుంచి కోలుకున్నారు. రాజశేఖర్ పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే కనిపించింది. ఇప్పుడు ఆయన కూడా కోలుకుంటున్నారన్న వార్త అభిమానులకు ఉపశమనమే.
This post was last modified on October 29, 2020 2:05 pm
అదేంటో గానీ.. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని ఏ విషయంపై అయినా అధికారులు, పోలీసులపైకి…
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…