తమిళ స్టార్ హీరో కార్తి ప్రధాన పాత్రలో లోకేష్ కనకరాజ్ రూపొందించిన ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ‘ఖైదీ-2’ రాబోతున్నట్లు కొన్నేళ్ల ముందే ప్రకటించారు. కానీ అదేమీ సీక్వెల్ కాదు. ప్రీక్వెల్. ‘ఖైదీ’ చిత్రంలో హీరో చాలా ఏళ్లు జైల్లో గడిపి బయటికి వచ్చిన దగ్గర్నుంచి కథ మొదలవుతుంది. ఎక్కడా అతడి గతంలో ఏం జరిగిందో చూపించరు. ‘ఖైదీ-2’లో చూపించబోయేది ఆ కథే. తన నేపథ్యంతో మొదలుపెట్టి జైలుకు వెళ్లడానికి దారి తీసిన పరిస్థితుల నేపథ్యంలోనే ఆ కథ నడుస్తుందని లోకేష్ ఇంతకుముందే హింట్ ఇచ్చాడు. ఇలా వర్తమానంలో ఓ కథను చూపించాక.. వెనక్కి వెళ్లి ఫ్లాష్ బ్యాక్ స్టోరీని రెండో భాగంలో చూపించడం అరుదైన విషయమే.
ఐతే ‘ఖైదీ-2’ రాకముందే మరో చిత్రంలో ఈ ప్రయోగం జరగబోతోంది. ఆ చిత్రమే.. వీర ధీర శూర. విక్రమ్ హీరోగా అరుణ్ కుమార్ రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పార్ట-2 పేరుతో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇలా పార్ట్-2 అని తొలి సినిమాను రిలీజ్ చేయడం ఇప్పటిదాకా ఎవరూ చేసి ఉండరు. ఈ సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్లో విక్రమ్ మాట్లాడుతూ.. ఇందులో హీరోకు ఒక పెద్ద కథ ఉంటుందని.. ఆ కథను ఈ సినిమాలో చూపించడానికి అవకాశం లేకపోయిందని.. అందుకే తర్వాత పార్ట్-1గా దాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పాడు.
చాలా ఏళ్ల నుంచి రకరకాల ప్రయోగాలు చేసి దెబ్బ తిన్న విక్రమ్.. ‘వీర ధీర శూర’ రూపంలో పక్కా కమర్షియల్ మూవీ చేశాడు. ఇది తన ఆకలి తీర్చేలాగే కనిపిస్తోంది. సిద్ధార్థ్తో ‘చిన్నా’ సినిమా తీసిన దర్శకుడే దీన్ని రూపొందించాడు. ఇందులో విక్రమ్ కిరాణా కొట్టు నడిపే మామూలు వ్యక్తిగా కనిపించనున్నాడు. హీరో కిరాణా కొట్టు నడపడం ఏంటి.. ఇలాంటి పాత్రలో హీరోయిజం ఎలా సాధ్యం అని సందేహం కలగొచ్చు. ఇందులో హీరోయిజం మామూలుగా ఉండదని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు పృథ్వీ ఓ కీలక పాత్ర పోషించగా.. దుషారా విజయ్ కథానాయికగా చేసింది. ఎస్.జె.సూర్య ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.
This post was last modified on March 23, 2025 3:05 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…