ఒక సినిమాకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంగీకారం తెలిపినపుడు అడ్వాన్స్ ఇస్తూ అగ్రిమెంట్ మీద ఇరు పక్షాలు సంతకాలు చేసుకోవడం మామూలే. ఆ అగ్రిమెంట్లో రకరకాల కండిషన్లు కూడా ఉంటాయి. అవి అన్నీ చదివేవాళ్లు తక్కువ. తాను కూడా ఒక సినిమాకు అలాగే చూడకుండా సంతకం పెట్టానని.. కానీ తర్వాత అందులో ఉన్న ఒక కండిషన్ తెలిసి ఆశ్చర్యపోయానని అంటోంది తెలుగులో పాపులర్ అయిన బాలీవుడ్ భామ నిధి అగర్వాల్. నాగచైతన్య మూవీ ‘సవ్యసాచి’తో తెలుగులోకి అడుగు పెట్టిన నిధి.. అంతకంటే ముందు ‘మున్నా మైకేల్’తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాకు తాను సంతకం చేసిన అగ్రిమెంట్లో.. హీరోతో డేట్ చేయకూడదనే కండిషన్ ఉన్న విషయం ఆలస్యంగా తెలిసిందని నిధి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
‘‘మున్నా మైకేల్తో నా కెరీర్ ఆరంభమైంది. ఆ హిందీ చిత్రంలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించాడు. ఆ సినిమాకు ఓకే చెప్పాక టీం నాతో ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయించింది. సినిమాకు సంబంధించి నేను పాటించాల్సిన విధి విధానాలు అందులో ఉన్నాయి. సంతకం చేసినపుడు నేను అందులో ఏముందో పెద్దగా చదవలేదు. కానీ తర్వాత నాకు ఓ విషయం తెలిసింది.
‘నో డేటింగ్’ అని షరతు పెట్టారు. సినిమా పూర్తయ్యే వరకు హీరోతో డేట్ చేయకూడదన్నది దాని సారాంశం. ఇది తెలిసి ఆశ్చర్యపోయా. ప్రేమలో పడితే పని మీద దృష్టిపెట్టరని.. ఆ టీం భావించి ఉండొచ్చు. అందుకే ఆ కండిషన్ పెట్టారేమో’’ అని నిధి వెల్లడించింది. బాలీవుడ్లో ఒక సినిమా చేస్తూ ప్రేమలో పడిన జంటలు చాలానే ఉన్నాయి. ఐతే ‘మున్నా మైకేల్’ చేసే సమయానికి టైగర్కు దిశా పఠాని గర్ల్ ఫ్రెండ్గా ఉండేది. కానీ తర్వాత ఈ జంట విడిపోయింది. నిధికి అయితే ఇప్పటిదాకా బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు ఎలాంటి రూమర్లు రాలేదు.
This post was last modified on March 22, 2025 3:17 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…