Movie News

మహేష్ బాబు సినిమా గురించి వరదరాజ మన్నార్

ఎక్కడ ఏ రాష్ట్రంలో షూటింగ్ చేసినా అదో పెద్ద సంచలనంగా మారిపోయిన ఎస్ఎస్ఎంబి 29 గురించి రాజమౌళి ఇప్పటిదాకా అధికారికంగా చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టడం చేయలేదు. ఒకటి రెండు షెడ్యూల్స్ అయ్యాక మీడియాని కలుస్తారనే వార్తలు తిరుగుతూనే ఉన్నాయి కానీ ఎంతకీ కార్యరూపం దాల్చడం లేదు. ఆఖరికి పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సైతం బయటికి రాకుండా మేనేజ్ చేశారు. కనీసం వెయ్యి కోట్లతో థియేటర్ బిజినెస్ మొదలవుతుందనే అంచనాలు దీని మీద బలంగా ఉన్నాయి. దీని తాలూకు విశేషాలు ఎప్పుడెప్పుడు దొరుకుతాయాని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇందులో పృథ్విరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్2 ఎంపురాన్ ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆయనకు ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాను ఏడాది పై నుంచే ఈ ప్రాజెక్టులో ఉన్నానని, ప్రస్తుతానికి ఇంతకు మించి వివరాలు చెప్పలేనని, అయినా లీకుల వీడియోలు ఫోటోలు చూడటం వల్ల కొందరు ఎలాంటి ఆనందం పొందుతున్నారో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి టైం వచ్చినప్పుడు ఇదే ప్లాట్ ఫార్మ్ మీద మరోసారి మహేష్ మూవీ గురించి మాట్లాడుకుందామని డాటవేశాడు.

ఈ మూవీలో పృథ్విరాజ్ విలనా లేక ఇంకేదైనా ముఖ్యమైన పాత్రా అనేది బయటికి రాలేదు. ప్రతినాయకుడిగా నటించడం ఆయనకు కొత్త కాదు. ఆ మధ్య అక్షయ్ కుమార్ బడేమియా చోటేమియాలో చేశారు కానీ అది ఆశించిన ఫలితం అందుకోలేదు. సలార్ లోనూ విలన్ అన్నారు కానీ తీరా సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా ప్రాధాన్యం ఉండటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇది కాసేపు పక్కనపెడితే భారీ బడ్జెట్ తో స్వీయ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్ తీసిన ఎల్2 ఎంపురాన్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఆశ్చర్యపోయే నెంబర్లు నమోదు చేస్తోంది. తెలుగులో నిర్మాత దిల్ రాజు పెద్ద ఎత్తున పంపిణి చేస్తున్నారు.

This post was last modified on March 22, 2025 11:51 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఢిల్లీ లో రేవంత్… ఆ సారైనా గ్రీన్ సిగ్నల్ లభించేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి…

20 minutes ago

విజయ్ చివరి సినిమా….పండగ మొదట్లో

తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా నిర్మాణంలో ఉన్న జన నాయగన్ విడుదల తేదీ వచ్చేసింది. 2026 జనవరి…

60 minutes ago

లూసిఫర్ వెనుక 13 సంవత్సరాల విషాదం

ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు.…

2 hours ago

పార్లమెంటులో ‘అరకు’!… ఒకటి కాదు, రెండు స్టాళ్లు!

ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…

2 hours ago

జగన్ ‘గడప’పై టీడీపీ జెండా ఎగరబోతోందా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగా ముద్రపడ్డ కడపలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మొన్నటి సార్వత్రిక…

2 hours ago

త‌మ్మినేని డిగ్రీ వివాదం.. క‌దిలిన విజిలెన్స్‌

వైసీపీ నాయ‌కుడు, అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వంతు వ‌చ్చింది. ఆయ‌న గ‌తంలో ఎన్నికల అఫిడ‌విట్‌లో స‌మ‌ర్పించిన డిగ్రీ…

3 hours ago