Movie News

వేణు స్వామి… ఇంత నీచమా?

అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళ శుభమా అని పెళ్లి చేసుకుంటుంటే.. కొన్నేళ్లలోనే వీళ్లు విడాకులు తీసుకుంటారని వ్యాఖ్యానించిన ఘనత ఆయనకే సొంతం. ప్రభాస్ ఆరోగ్యం, తన కెరీర్ గురించి కూడా గతంలో వేణు స్వామి చెప్పిన జోస్యాలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆ వ్యాఖ్యలపై స్వయంగా ప్రభాస్ పెద్దమ్మ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వేణు స్వామి చుట్టూ చాలా వివాదాలే ఉన్నాయి. చైతూ-శోభితల గురించి వేణు స్వామి మాట్లాడినపుడు తెలుగు సినీ పరిశ్రమ తరఫున కొందరు వెళ్లి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేయడం.. దీని మీద మీడియాలో కూడా రాద్దాంతం జరగడంతో వేణు స్వామి కొంచెం వెనక్కి తగ్గినట్లు కనిపించారు.

ఐతే కుక్క తోక వంకర అనే సామెతను గుర్తు చేస్తూ ఆయన తాజాగా ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ కొందరు సినీ తారల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వేణు స్వామి మీద ఇంతకుముందే టీవీ5లో చర్చ పెట్టి ఆయనకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసిన సీనియర్ జర్నలిస్ట్ మూర్తి.. తాజాగా మరోసారి వేణు స్వామి బాగోతాన్ని బయటపెట్టారు. ఒక జర్నలిస్టుతో మాట్లాడుతూ.. ముగ్గురు సినీ ప్రముఖులు రాబోయే రోజుల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోతారని వేణు స్వామి జోస్యం చెప్పారు. ఆ ముగ్గురూ.. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత కావడం గమనార్హం.

ప్రభాస్‌కు టాప్‌ టు బాటమ్ ఒళ్లంతా గాయాలే అంటూ.. ఆ బాధ తట్టుకోలేక సుసైడ్ చేసుకోవచ్చని వేణు స్వామి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పినవి గతంలో చాలా జరిగాయని.. ఇప్పుడు ఇవి కూడా జరిగి తీరుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి ఇలా మాట్లాడి, వారితో పరిహార పూజలు చేయించి భారీగా డబ్బులు తీసుకోవడం వేణు స్వామికి అలవాటని.. వేణు స్వామి బాధితులు చాలా మంది గురించి తనకు తెలుసని.. ఇండస్ట్రీ ఐకమత్యంగా ఉండి ఇలాంటి వారి పని పట్టాలని మూర్తి ఈ చర్చా కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

This post was last modified on March 21, 2025 5:27 pm

Share
Show comments
Published by
Kumar
Tags: venu swamy

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

28 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago