మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ కు హైప్ ఉన్న మాట వాస్తవమే కానీ అది కేరళలోనే అధికంగా ఉంది. మిగిలిన భాషల్లో ఆశించిన బజ్ ఇంకా రాలేదు. ట్రైలర్ చూశాక అంచనాలు పెరిగాయి కానీ అవి ఎక్స్ట్రాడినరి ఓపెనింగ్స్ కి ఎంత వరకు దారి తీస్తాయో చెప్పలేం. అయితే బుక్ మై షోలో సగటున గంటకు 97 వేల టికెట్లు అమ్ముడుపోతున్నట్టు చూపిస్తున్న నెంబర్లు అభిమానులకు సైతం షాక్ ఇస్తున్నాయి. మాములుగా అయితే యునానిమస్ ప్రీ పాజిటివ్ బజ్ ఉన్న ప్యాన్ ఇండియా మూవీస్ కి ఇలాంటి రికార్డులు మొదలవుతాయి. కానీ ఎల్2 ఎంపురాన్ కు మలయాళం మినహాయించి ఇతర భాషల్లో క్రేజ్ లేకపోయినా ఇంత స్పందన అనూహ్యం.
నిజంగానే ఆ రేంజ్ లో టికెట్లు అమ్ముడుపోతున్నాయా లేక ఏదైనా టెక్నికల్ గ్లిట్జ్ వల్ల అలా చూపిస్తుందో అంతు చిక్కడం లేదు. ఒకవేళ వాస్తవమే అయితే మోహన్ లాల్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయిందని చెప్పొచ్చు. సలార్ తో మనకు బాగా దగ్గరైన పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఎల్2 ఎంపురాన్ చాలా పెద్ద బడ్జెట్ తో తీశారు. మల్లువుడ్ లో మొదటి ఐమ్యాక్స్ మూవీ ఇది. బిజినెస్ పరంగానూ సులభంగా మూడు వందల కోట్లకు పైగా వసూలు చేస్తుందనే అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బలంగా ఉన్నాయి. మనవైపు ఏపీ తెలంగాణలో దిల్ రాజు పంపిణి చేయడం పెద్ద ప్లస్ కానుంది.
కాకపోతే ఎల్2 ఎంపురాన్ కు పోటీ గట్టిగానే ఉంది. తెలుగులో రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ కవ్విస్తుండగా తమిళంలో వీరధీరశూర పార్ట్ 2 నుంచి కాంపిటీషన్ టఫ్ గా ఉంది. అయితే మోహన్ లాల్ టీమ్ మాత్రం చాలా నమ్మకంగా ఉంది. గత కొంత కాలంగా ఈ సీనియర్ హీరోని వరస డిజాస్టర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్వీయ దర్శకత్వంలో తీసిన బరోజ్ నామరూపాల్లేకుండా పోయింది. అందుకే ఆ కసితో ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. బుక్ మై షోలో దూకుడు చూస్తుంటే అన్నంత పని చేసేలానే ఉన్నాడు. మూడు గంటల అయిదు నిమిషాల నిడివితో ఎలాంటి కంటెంట్ ఇస్తారో చూద్దాం.
This post was last modified on March 21, 2025 11:13 am
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…