ఆ మధ్య ఒక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీ కపూర్ మీద టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా వసూళ్లు చూసి బాలీవుడ్ నిర్మాతలు నిద్ర పోలేదని వ్యాఖ్యానించడమే కాక.. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీయలేకపోతున్నారంటూ బోనీతో సంవాదానికి దిగాడు నాగవంశీ. దీనిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అలాగే అక్కడి మీడియా ప్రతినిధులు నాగవంశీ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై అప్పుడే నాగవంశీ స్పందించాడు.
తాను నిర్మాత కావడానికే కరణ్ జోహార్ లాంటి వాళ్లు స్ఫూర్తి అంటూ.. బోనీని తనేమీ కించపరచలేదన్నాడు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటుడు సంతోష్ శోభన్ ఈ అంశంపై నాగవంశీని ప్రశ్నించాడు. దీనికి అతను తనదైన శైలిలో బదులిచ్చాడు. బోనీ కపూర్ జాన్వి కపూర్ తండ్రి అని.. అలాంటి అమ్మాయిని కన్న వ్యక్తిని ఎవరైనా అగౌరవ పరుస్తారా అని నాగవంశీ ఎదురు ప్రశ్నించాడు. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క కోణంలో ఆలోచిస్తే తాను బోనీని కించపరచలేదని అర్థమవుతుందని నాగవంశీ ఫన్నీగా బదులిచ్చాడు.
ఇక ఈ మధ్య చాలామంది ప్రమోషన్ల కోసం సింపతీ కార్డ్ వాడుతున్నారు కదా, మరి మీ దగ్గర అలాంటి ఐడియా ఏమైనా ఉందా అని అడిగితే.. దానికీ నాగవంశీ ఫన్నీగా బదులిచ్చాడు. ఇటీవల విజయవాడలో జరిగిన రాబిన్ హుడ్ ప్రమోషనల్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. తమ సినిమా మాత్రమే ముందు చూడాలని అన్నాడని.. అంటే వేరే సినిమాలు చూడొద్దన్నది ఆయన ఉద్దేశమని.. ఇది తనకెంతో బాధ కలిగించిందని.. తమ సినిమాను తక్కువ చేశారని తెలుగు ప్రేక్షకులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని మ్యాడ్ స్క్వేర్ సినిమాను బాగా చూసి పెద్ద హిట్ చేయాలని నాగవంశీ అన్నాడు. నాగవంశీ సరదాగానే ఈ విషయం మాట్లాడడంతో తన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
This post was last modified on March 21, 2025 10:31 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…