ఆ మధ్య ఒక రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో బాలీవుడ్ సీనియర్ నిర్మాత బోనీ కపూర్ మీద టాలీవుడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా వసూళ్లు చూసి బాలీవుడ్ నిర్మాతలు నిద్ర పోలేదని వ్యాఖ్యానించడమే కాక.. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీయలేకపోతున్నారంటూ బోనీతో సంవాదానికి దిగాడు నాగవంశీ. దీనిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అలాగే అక్కడి మీడియా ప్రతినిధులు నాగవంశీ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై అప్పుడే నాగవంశీ స్పందించాడు.
తాను నిర్మాత కావడానికే కరణ్ జోహార్ లాంటి వాళ్లు స్ఫూర్తి అంటూ.. బోనీని తనేమీ కించపరచలేదన్నాడు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నటుడు సంతోష్ శోభన్ ఈ అంశంపై నాగవంశీని ప్రశ్నించాడు. దీనికి అతను తనదైన శైలిలో బదులిచ్చాడు. బోనీ కపూర్ జాన్వి కపూర్ తండ్రి అని.. అలాంటి అమ్మాయిని కన్న వ్యక్తిని ఎవరైనా అగౌరవ పరుస్తారా అని నాగవంశీ ఎదురు ప్రశ్నించాడు. మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి ఈ ఒక్క కోణంలో ఆలోచిస్తే తాను బోనీని కించపరచలేదని అర్థమవుతుందని నాగవంశీ ఫన్నీగా బదులిచ్చాడు.
ఇక ఈ మధ్య చాలామంది ప్రమోషన్ల కోసం సింపతీ కార్డ్ వాడుతున్నారు కదా, మరి మీ దగ్గర అలాంటి ఐడియా ఏమైనా ఉందా అని అడిగితే.. దానికీ నాగవంశీ ఫన్నీగా బదులిచ్చాడు. ఇటీవల విజయవాడలో జరిగిన రాబిన్ హుడ్ ప్రమోషనల్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. తమ సినిమా మాత్రమే ముందు చూడాలని అన్నాడని.. అంటే వేరే సినిమాలు చూడొద్దన్నది ఆయన ఉద్దేశమని.. ఇది తనకెంతో బాధ కలిగించిందని.. తమ సినిమాను తక్కువ చేశారని తెలుగు ప్రేక్షకులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని మ్యాడ్ స్క్వేర్ సినిమాను బాగా చూసి పెద్ద హిట్ చేయాలని నాగవంశీ అన్నాడు. నాగవంశీ సరదాగానే ఈ విషయం మాట్లాడడంతో తన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…