గతంలో హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించిన కమెడియన్ సప్తగిరి.. చివరగా లీడ్ రోల్ చేసిన రెండు మూడు సినిమాలు తేడా కొట్టడంతో ఆ వేషాలను పక్కన పెట్టేశాడు. కమెడియన్గా కూడా అతడికి కొంచెం డిమాండ్ తగ్గింది. ఇలాంటి టైంలో అతను మళ్లీ హీరోగా చేసిన సినిమా.. పెళ్ళికాని ప్రసాద్. ఈ సినిమా ఎప్పుడు మొదలైందో, పూర్తయిందో తెలియదు. సడెన్గా రిలీజ్ డేట్తో టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ బాగానే అనిపించగా.. అంతకుమించి ఆకర్షించిన విషయం దిల్ రాజు నిర్మాణ సంస్థ ‘ఎస్వీసీ’ బేనర్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు రావడం. దిల్ రాజు బేనర్ అంటే ఒక బ్రాండ్ అన్నట్లే. ఆ సంస్థ ఏవైనా వేరే ప్రొడక్షన్ హౌస్లు నిర్మించిన చిత్రాలను రిలీజ్ చేస్తోంది అంటే అందులో బలమైన కంటెంట్ ఉందని ప్రేక్షకులు నమ్ముతారు.
ఐతే ఈ సినిమాను రాజు బేనర్ టేకప్ చేయడానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడే కారణమట. ఈ విషయాన్ని సప్తగిరే స్వయంగా వెల్లడించాడు. ‘‘మళ్లీ హీరోగా నటిస్తే మంచి కథతోనే చేయాలని చాలా రోజులు ఎదురు చూసి ‘పెళ్ళి కాని ప్రసాద్’ చిత్రాన్ని ఎంచుకున్నా. సినిమా మొదలవడానికి ముందే దర్శకుడు మారుతిని కలిసి కథ చెప్పా. ఆయన ఫస్ట్ కాపీతో రమ్మని చెప్పారు. ఆయన చెప్పినట్లే సినిమాను పూర్తి చేసి చూపించాం. సరిగ్గానే చేశారన్నారు. తర్వాత అనిల్ రావిపూడికి సినిమాను చూపించాను. ఆయనే నిర్మాత శిరీష్కు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు.
నేను నటుడిగా ప్రయాణం మొదలుపెట్టింది దిల్ రాజు సంస్థలోనే. ఐతే వాళ్లకు కంటెంట్ నచ్చితేనే సినిమాను రిలీజ్ చేస్తారు. శిరీష్ గారు సినిమా చూసి నచ్చాకే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ‘పెళ్ళి కాని ప్రసాద్’ అనేది వెంకటేష్ గారు చేసిన గొప్ప పాత్ర. మా సినిమా ఆ పేరుకున్న బలాన్ని ఇంకా పెంచేలా ఉండాలనుకుని పని చేశాం. ఈ సినిమా ట్రైలర్ చూసి వెంకటేష్ గారు కూడా కంటెంట్ బాగుందన్నారు’’ అని సప్తగిరి చెప్పాడు. ఈ సినిమా చేస్తున్న టైంలో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లకు పెళ్లయిందని.. తనకు కూడా త్వరలో పెళ్లవుతుందేమో చూడాలని సప్తగిరి అన్నాడు.
This post was last modified on March 20, 2025 3:29 pm
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితం పట్ల దర్శకుడు ఆదిత్య హాసన్ టెన్షన్ పడుతున్న…
భారత్లో కొత్త కార్లు కొనేవాళ్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. ఆగస్టులో పెట్రోల్ కార్ల కంటే CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు…