`బెట్టింగ్ యాప్` వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ యాప్ల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టి.. మోసపోతున్న విషయం తెలిసిందే. దీంతో వారు ఆర్థిక కష్టాలు తాళలే క.. రుణ గ్రహీతల నుంచి వస్తున్న వత్తిళ్లు తట్టుకోలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు.
తొలుత.. బెట్టింగ్ యాప్లపై యువతకు, మధ్యతరగతి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నవారిపై కేసులు పెడుతున్నారు. అలానే.. ఈ యాప్లను ప్రచారం చేస్తూ.. బెట్టింగ్యాప్లకు ప్రచార కర్తలుగా ఉంటున్న ప్రముఖుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మియాపూర్ కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ హీరో దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, యాంకర్లు సిరిహన్మంత్, శ్రీముఖి, వర్షిణి, శ్యామల సహా.. యూట్యూబర్లు బయ్యా సన్నీయాదవ్, ఇలా.. మొత్తం 25 మందిపై కేసులు కట్టారు. కేసులు నమోదు చేసిన వారిలో ఆరుగురు ప్రముఖ నటులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం ఈ కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…