`బెట్టింగ్ యాప్` వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ యాప్ల కారణంగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పెట్టుబడులు పెట్టి.. మోసపోతున్న విషయం తెలిసిందే. దీంతో వారు ఆర్థిక కష్టాలు తాళలే క.. రుణ గ్రహీతల నుంచి వస్తున్న వత్తిళ్లు తట్టుకోలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణలోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు బెట్టింగ్ యాప్లపై ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు చేస్తున్నారు.
తొలుత.. బెట్టింగ్ యాప్లపై యువతకు, మధ్యతరగతి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్నవారిపై కేసులు పెడుతున్నారు. అలానే.. ఈ యాప్లను ప్రచారం చేస్తూ.. బెట్టింగ్యాప్లకు ప్రచార కర్తలుగా ఉంటున్న ప్రముఖుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సినీ రంగానికి చెందిన ప్రముఖ నటులపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
మియాపూర్ కు చెందిన ప్రమోద్ శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రముఖ హీరో దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, యాంకర్లు సిరిహన్మంత్, శ్రీముఖి, వర్షిణి, శ్యామల సహా.. యూట్యూబర్లు బయ్యా సన్నీయాదవ్, ఇలా.. మొత్తం 25 మందిపై కేసులు కట్టారు. కేసులు నమోదు చేసిన వారిలో ఆరుగురు ప్రముఖ నటులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఐటీ చట్టం ప్రకారం ఈ కేసులు నమోదు చేసినట్టు వివరించారు.
This post was last modified on March 20, 2025 12:12 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…