సంగీత దర్శకుడు తమన్ మళ్ళీ హాట్ టాపిక్ అయిపోయాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ పాటలు హుక్ స్టెప్స్ లేకపోవడం వల్ల ఎక్కువ రీచ్ తెచ్చుకోలేదని, తనవరకు బెస్ట్ ఇచ్చాననే రీతిలో కామెంట్ చేయడం మెగా ఫ్యాన్స్ చర్చకు దారి తీసింది. ఇదే తమన్ గేమ్ ఛేంజర్ రిలీజ్ ముందు ఒక రియాలిటీ షోలో జరగండి జరగండి పాట చూశానని, ప్రభుదేవా కొరియోగ్రఫీ అదిరిపోయిందని ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదే విషయాన్ని పలు ట్వీట్ల ద్వారా ఊరిస్తూ వచ్చాడు. ఇటీవలే జరిగిన ఒక డాన్స్ ప్రోగ్రాంలో చిన్న పాపను మెచ్చుకుంటూ ఇదే డాన్స్ గేమ్ ఛేంజర్లో ఉంటే బాగుండేదని కామెంట్ చేశాడు.
ఇలా ఒకే అంశం మీద తమన్ రెండు రకాలుగా మాట్లాడ్డం పట్ల మ్యూజిక్ లవర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా పాటలు బాగుంటే సినిమా బాక్సాఫిస్ ఫలితంతో సంబంధం లేకుండా జనాలకు ఎక్కేస్తాయి. ఎక్కడిదాకో ఎందుకు, గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి 2024లోనే టాప్ సాంగ్ అయ్యింది. దాన్ని స్వరపరిచింది తమనేగా. మొన్న పండక్కు తనే కంపోజ్ చేసిన డాకు మహారాజ్ కన్నా సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్ ఛార్ట్ బస్టర్స్ ఎలా అయ్యాయి. వెంకటేష్ డాన్సుల వల్ల కాదుగా. భీమ్స్ సిసిరోలియో ట్యూన్ల వల్ల అనేది ఎవరైనా ఒప్పుకుంటారు. అంటే తమన్ లాజిక్ మిస్ అవుతున్నాడని అర్థమవుతోంది.
డిజాస్టర్ ఆల్బమ్స్ అందరికి ఉంటాయి. మాస్ట్రో ఇళయరాజా నుంచి ఆస్కార్ అందుకున్న కీరవాణిలు సైతం బాలేని పాటలు ఇచ్చిన దాఖలాలు బోలెడు. వాటిని కారణాలు ఏమైనా ఇతరుల మీదకు తోసేసిన ఉదంతాలు పెద్దగా కనిపించవు. కానీ తమన్ హీరో, కొరియోగ్రాఫర్ మీదను నెపం వేయడాన్ని చాలా మంది సమర్ధించలేకపోతున్నారు. ఇంకో సందర్భంలో అల వైకుంఠపురములో ఉదాహరణ చెప్పిన తమన్ గతంలో ఇచ్చిన ఫ్లాపుల గురించి ఎక్కడా గేమ్ ఛేంజర్ తరహాలో మాట్లాడలేదని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తమన్ ఆడుతున్న మాటల ‘గేమ్’ వ్యవహారాన్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తోంది.
This post was last modified on March 20, 2025 11:49 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…