భారతీయ చరిత్రలో అత్యంత వివాదాస్పద సినిమాల్లో ఒకటిగా పేరొందిన చిత్రం బండిట్ క్వీన్. 1994 శేఖర్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా అప్పట్లో పెను సంచలనాలు సృష్టించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బందిపోటు రాణిగా పేరొందిన పూలన్ దేవి జీవితాన్ని ఆధారంగా చేసుకుని సీమా బిస్వాస్ టైటిల్ రోల్ పోషించగా సుప్రసిద్ధ నస్రత్ ఫతే అలీ ఖాన్ సంగీతం సమకూర్చారు. సెన్సార్ దశ నుంచే కాంట్రవర్సీకి కేంద్రంగా నిలిచిన బాండిట్ క్వీన్ ని నిషేదించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లో పూలన్ దేవి బహిరంగంగా హెచ్చరిక చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది.
అగ్రవర్ణాల వాళ్ళు తక్కువ జాతికి చెందిన పూలన్ దేవి వివస్త్రను చేసి బావిలో నీళ్లు తోడించడం, సామూహిక మానభంగం చేయడం అన్నీ బోల్డ్ గా చిత్రీకరించడంతో అప్పట్లో బాండిట్ క్వీన్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరికి అన్ని అడ్డంకులు దాటుకుని జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా థియేటర్ రిలీజ్ చేస్తే ఘనవిజయం సాధించింది. దేశీ విదేశీ వసూళ్లు కలిపి ఒకటికి పదింతలు లాభం తెచ్చిన సినిమాగా దీని గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బాండిట్ క్వీన్ ని చూసి శేఖర్ కపూర్ నివ్వెరపోయారు. కారణం చాలా భాగం ఎడిటింగ్ చేయడమే.
50 డిగ్రీల మండుటెండల్లో ఎంతో కష్టపడి బాండిట్ క్వీన్ తీశామని, ఎక్కడో రూమ్ లో కూర్చుని ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేసిన వాళ్లకు ఆ శ్రమ తెలియదని సుదీర్ఘంగా ట్వీట్ చేశారు. టీమ్ గౌరవానికి భంగం కలిగించేలా కత్తిరింపులు చేయడం పట్ల కలత చెందినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా జాతీయ అవార్డు దక్కించుకున్న బాండిట్ క్వీన్ లాంటి క్లాసిక్ మూవీకి ఇలా ఎడిటింగ్ పేరుతో కోతలు వేయడం నిజంగా అవమానమే. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో కేవలం ఏడు సినిమాలు మాత్రమే తీసిన శేఖర్ కపూర్ బెస్ట్ వర్క్ ఏదంటే మూవీ లవర్స్ వెంటనే చెప్పే పేరు మిస్టర్ ఇండియా. ఆ తర్వాత స్థానం బాండిట్ క్వీన్ దే.
This post was last modified on March 20, 2025 6:37 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…