Movie News

బాక్సాఫీస్ మీద IPL ప్రభావం ఉంటుందా

క్రికెట్ పండగ వస్తోంది. మార్చి 22 నుంచి మే 25 దాకా రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు దేశ విదేశాల నుంచి క్రికెటర్లు ఇండియాకు వచ్చేస్తున్నారు. ఈసారి ప్రతి టీమ్ వెరైటీగా సినిమా ట్రైలర్ల తరహాలో ప్లేయర్ల వీడియోలు చేయించి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏకధాటిగా అరవై రోజులకు పైగా రోజుకో మ్యాచ్ ఉండబోతున్న నేపథ్యంలో వీటి ప్రభావం బాక్సాఫీస్ మీద ఎలా ఉంటుందోననే ఆందోళన ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది ప్రతి ఏడాది జరిగే టోర్నమెంటే అయినా సంవత్సరాలు గడిచే కొద్దీ క్రేజ్ ఊహించని స్థాయిలో అంతకంతా పెరుగుతూ పోవడమే దీనికి కారణం.

ఒకపక్క మండిపోతున్న ఎండలు. ఇంకోవైపు క్రికెట్. మధ్యలో చాలా బాగుందనే టాక్ వస్తే తప్ప థియేటర్ ముఖాలు చూడని జనం. ఈ నేపథ్యంలో వేసవి కాలం నిర్మాతలకు పెద్ద పరీక్షే పెట్టనుంది. కాంపిటీషన్ ఎంత ఉన్నా ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా ఆడే మ్యాచులకు ఎక్కువ డిమాండ్, వ్యూయర్ షిప్ ఉంటుంది. తర్వాతి వరసలో లక్నో, ఢిల్లీ, రాజస్థాన్ తదితరాలు ఉన్నాయి. అన్ని సాయంత్రం ఏడున్నరకు మొదలయ్యే నైట్ మ్యాచులు కావడంతో ఈవెనింగ్, సెకండ్ షోల మీద వీటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినవాటికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ యావరేజ్, ఫ్లాపులకు చిక్కొస్తుంది.

ఏప్రిల్ రెండో వారం నుంచి చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. జాక్ తో మొదలుపెట్టి అటుపై హరిహర వీరమల్లు దాకా వారానికి ఒకటి రెండు భారీ బడ్జెట్లతో బరిలో దిగుతున్నాయి. ఎక్స్ ట్రాడినరి అనిపించుకుంటే ఐపీఎల్ తో వచ్చే నష్టమేమి లేదు. టాక్స్ బాగుంటే ఉదయం, మధ్యాన్నం ఆటలు సమ్మర్ లోనే బాగా నిండుతాయి. ఏసి చల్లదనంతో పాటు బాగున్న బొమ్మ చూస్తామనే ఆలోచన ఎక్కువ పబ్లిక్కుని థియేటర్ల వైపు లాగుతుంది. మార్చి చివరిలో వారం డబ్బింగ్ స్ట్రెయిట్ కలిపి మొత్తం నాలుగు చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ముందు క్రికెట్ వల్ల ప్రభావితం చెందేవి ఇవే.

This post was last modified on March 19, 2025 7:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

49 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago