మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధం లేని మ్యాటర్. ఒక్కోసారి ఈ ఆలస్యం ఆడియో ఆల్బమ్ మీద ప్రభావం చూపించిన సందర్భాలు లేకపోలేదు. తమన్ మాత్రం ది రాజా సాబ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ ప్యాన్ ఇండియా మూవీ ప్రారంభంలో కంపోజ్ చేసుకున్న ట్యూన్స్ కాల ప్రభావం వల్ల ఫ్రెష్ నెస్ కోల్పోయాయని, అందుకే వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ తాజాగా కొత్త పాటలు చేసే పనిలో ఉన్నట్టు చెప్పాడు. దానికి కారణాలు కూడా వివరించాడు.
ముప్పై నలభై కోట్లు పెట్టి ఆడియో కంపెనీలు హక్కులు కొంటున్నప్పుడు బెస్ట్ ఇచ్చే బాధ్యత సంగీత దర్శకుల మీద ఉంటుందని, అందుకే రాజా సాబ్ కోసం అదనంగా కష్టపడేందుకు సిద్ధమయ్యామని చెప్పుకొచ్చాడు. నిజమేగా. గేమ్ ఛేంజర్ కు ఈ సమస్య రావడం వల్లే ఒకటి రెండు సాంగ్స్ మినహాయించి మిగిలినవి పెద్ద రీచ్ కాలేదు. రాజా సాబ్ కు అలా జరగకూడదనే తమన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇంకా నాలుగు పాటల షూట్ బ్యాలన్స్ ఉంది. ప్రభాస్ డేట్ల కోసం మారుతీ ఎదురు చూస్తున్నాడు. ఫౌజీ నుంచి ఫ్రీ కాగానే వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పీపుల్స్ మీడియా టీమ్ ఎదురు చూస్తోంది.
ఇప్పుడు తమన్ చెప్పిన ప్రకారం పాటలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విడుదల తేదీ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దసరా లేదా దీపావళికి వస్తుందనే ఆశతో ఉన్న అభిమానుల కోరిక ఏ మేరేకు నెరవేరుతుందో చెప్పలేం. ఒకవేళ సాధ్యం కాకపోతే సలార్ లాగా డిసెంబర్ లో అయినా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజా సాబ్ ముందుగా సోలో డేట్ చూసుకుని రావడం బెటర్. హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
This post was last modified on March 18, 2025 10:52 am
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…