మాములుగా ఏదైనా పెద్ద సినిమాకు పాటల రికార్డింగ్ జరిగిపోయాక వాటిని ఎప్పుడు షూట్ చేస్తారు, ఎంత టైంలో విడుదలవుతుందనేది మ్యూజిక్ డైరెక్టర్ కు సంబంధం లేని మ్యాటర్. ఒక్కోసారి ఈ ఆలస్యం ఆడియో ఆల్బమ్ మీద ప్రభావం చూపించిన సందర్భాలు లేకపోలేదు. తమన్ మాత్రం ది రాజా సాబ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఈ ప్యాన్ ఇండియా మూవీ ప్రారంభంలో కంపోజ్ చేసుకున్న ట్యూన్స్ కాల ప్రభావం వల్ల ఫ్రెష్ నెస్ కోల్పోయాయని, అందుకే వాటిని పూర్తిగా పక్కన పెట్టేసి మళ్ళీ తాజాగా కొత్త పాటలు చేసే పనిలో ఉన్నట్టు చెప్పాడు. దానికి కారణాలు కూడా వివరించాడు.
ముప్పై నలభై కోట్లు పెట్టి ఆడియో కంపెనీలు హక్కులు కొంటున్నప్పుడు బెస్ట్ ఇచ్చే బాధ్యత సంగీత దర్శకుల మీద ఉంటుందని, అందుకే రాజా సాబ్ కోసం అదనంగా కష్టపడేందుకు సిద్ధమయ్యామని చెప్పుకొచ్చాడు. నిజమేగా. గేమ్ ఛేంజర్ కు ఈ సమస్య రావడం వల్లే ఒకటి రెండు సాంగ్స్ మినహాయించి మిగిలినవి పెద్ద రీచ్ కాలేదు. రాజా సాబ్ కు అలా జరగకూడదనే తమన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇంకా నాలుగు పాటల షూట్ బ్యాలన్స్ ఉంది. ప్రభాస్ డేట్ల కోసం మారుతీ ఎదురు చూస్తున్నాడు. ఫౌజీ నుంచి ఫ్రీ కాగానే వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు పీపుల్స్ మీడియా టీమ్ ఎదురు చూస్తోంది.
ఇప్పుడు తమన్ చెప్పిన ప్రకారం పాటలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. విడుదల తేదీ గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దసరా లేదా దీపావళికి వస్తుందనే ఆశతో ఉన్న అభిమానుల కోరిక ఏ మేరేకు నెరవేరుతుందో చెప్పలేం. ఒకవేళ సాధ్యం కాకపోతే సలార్ లాగా డిసెంబర్ లో అయినా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. 2026 సంక్రాంతికి ఆల్రెడీ పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాజా సాబ్ ముందుగా సోలో డేట్ చూసుకుని రావడం బెటర్. హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు కాగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
This post was last modified on March 18, 2025 10:52 am
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…