కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. దాని కంటే ముందు వచ్చిన కిరణ్ సినిమాలు ఎంత దారుణమైన ఫలితాన్ని అందుకున్నాయో తెలిసిందే. ముఖ్యంగా ‘రూల్స్ రంజన్’ సినిమా చూశాక కిరణ్ మీద ప్రేక్షకులు పూర్తిగా నమ్మకం కోల్పోయిన పరిస్థితి. దీంతో కిరణ్ బ్రేక్ తీసుకున్నాడు. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ‘క’ సినిమా చేస సక్సెస్ కొట్టాడు. ఇక కిరణ్ గాడిలో పడ్డాడనే అంతా అనుకున్నారు. కానీ తన లేటెస్ట్ రిలీజ్ ‘దిల్ రూబా’ చూస్తే మళ్లీ అతను పాత బాటలోకే వెళ్లిపోయినట్లే కనిపించింది. అందరికీ పాత రోజులే గుర్తుకు వచ్చాయి. ‘క’ తర్వాత కిరణ్ ఇలాంటి సినిమా చేశాడేంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కానీ వాస్తవం ఏంటంటే.. కిరణ్ ‘క’ కంటే ముందే చేసిన సినిమా ‘దిల్ రూబా’. కానీ దాన్ని హోల్డ్లో పెట్టి ‘క’ సినిమా చేశాడు. మంచి ఫలితాన్నందుకున్నాడు.కిరణ్ అంతకుముందు ఉన్న దారుణమైన ఫ్లాప్ స్ట్రీక్లోనే ‘దిల్ రూబా’ సినిమా కూడా రిలీజై ఉంటే అంతే సంగతులు. ఆ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ వచ్చేవి కావు. పైగా తన కెరీర్కు చాలా మైనస్ అయ్యేది. అతను ఇంకా కిందికి పడిపోయేవాడు. ఆ సినిమా రష్ చూసుకున్న కిరణ్కు దాని మీద నమ్మకం లేకే.. హోల్ట్లో పెట్టాడు. అదే సమయంలో ‘క’ తన కెరీర్ను మలుపు తిప్పగలదని నమ్మి దాన్ని పూర్తిచేసి రిలీజ్ చేశాడు.
‘క’ సక్సెస్ వల్ల కిరణ్ మీద ప్రేక్షకులకే కాదు.. ‘సరేగమ’ సంస్థకు కూడా గురి కుదిరింది. సినిమాను వాళ్లు కొని రిలీజ్ చేశారు. తద్వారా నిర్మాతలు సేఫ్ అయిపోయారు. సినిమా ఎలా ఉన్నప్పటికీ.. ట్రైలర్ బాగానే కట్ చేయడం, ‘క’ తాలూకు పాజిటివిటీ దీనికి యాడ్ కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ పర్వాలేదనిపించాయి. ముందు రెడీ అయింది కదా అని.. ‘క’ కంటే ముందే ‘దిల్ రూబా’ను రిలీజ్ చేసి ఉంటే కథ వేరుగా ఉండేది. సినిమాకు బిజినెస్సూ అయ్యేది కాదు. బజ్ క్రియేటయ్యేది కాదు. ఓపెనింగ్స్ కూడా వచ్చేవి కావు. మొత్తంగా ‘దిల్ రూబా’ను హోల్డ్లో పెట్టి ‘క’ను పూర్తిచేసి రిలీజ్ చేయడం తెలివైన ఎత్తుగడే. అందువల్లే ‘దిల్ రూబా’ను సేల్ చేయగలిగాడు కిరణ్.
This post was last modified on March 15, 2025 5:36 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…