షాలిని పాండే గుర్తుందా. విజయ్ దేవరకొండ అనే సెన్సేషన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా అనే ఫైర్ బ్రాండ్ దర్శకుడిని పరిశ్రమకు ఇచ్చిన బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి హీరోయిన్. డెబ్యూతోనే ఇంత పెద్ద హిట్టు సాధించినప్పుడు సహజంగా ఆఫర్లు వెల్లువెత్తుతాయి. కానీ ఈ జబల్ పూర్ బ్యూటీకి అలా జరగలేదు. స్టార్ హీరోల నుంచి పిలుపు రాకపోవడంతో అవకాశాలు పెద్దగా తలుపు తట్టలేదు. ఇదంతా 2017 నాటి ముచ్చట. మధ్యలో రాజ్ తరుణ్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జివి ప్రకాష్ లాంటి అగ్ర, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఫుల్ లెన్త్, క్యామియోలు చేసింది కానీ అవేవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ మహారాజ్ లోనూ ఛాన్స్ దక్కించుకుంది కానీ అదేమో డిజాస్టరయ్యింది. తాజాగా డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. ఒక రకంగా చెప్పాలంటే అర్జున్ రెడ్డి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర ఇదే. మధ్య తరగతి జీవితాన్ని నెట్టుకురాలేక భర్తతో జర్మనీలో సెటిలయ్యేందుకు కలలు కనే భార్యగా షాలినికి మంచి క్యారెక్టరే దక్కింది. ఆదాయం కోసం అత్త, మరో ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ప్రమాదకరమైన డ్రగ్స్ వ్యాపారం చేయడమనే పాయింట్ చుట్టూ డబ్బా కార్టెల్ తిరుగుతుంది. మొత్తం ఏడు ఎపిసోడ్లతో దర్శకుడు హితేష్ భాటియా దీన్ని రూపొందించారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న డబ్బా కార్టెల్ కు స్పందన బాగానే ఉంది. కొంచెం ల్యాగ్ తో పాటు కొన్ని కంప్లయింట్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొంచెం డీసెంట్ అని చెప్పుకోదగ్గ క్రైమ్ థ్రిల్లర్ ఇదేనని రివ్యూలు పెడుతున్నారు. సూర్య భార్య జ్యోతిక కూడా ఇందులో కీలకమైన రోల్ దక్కించుకున్నారు. అయితే ముంబైలో లక్షలాది మందికి జీవనోపాధిగా నిలిచిన టిఫిన్ బాక్సుల డబ్బా వ్యాపారాన్ని ఇలా చీకటి కోణంలో చూపించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కానీ మేకర్స్ మాత్రం అవేం పట్టించుకోకుండా ఈ ఏడాదిలోనే సెకండ్ సీజన్ కి రెడీ అవుతున్నారు.
This post was last modified on March 15, 2025 4:30 pm
స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్ ఇస్తున్న…
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…
అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…
ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…