తెరమీద ఇండియన్ సూపర్ హీరోస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు క్రిష్. హృతిక్ రోషన్ హీరోగా ఆయన తండ్రి రాకేష్ రోషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీ 2006 లోనే రికార్డులు బద్దలు గొప్ప విజయం సాధించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టి చిన్నా పెద్ద అందరిని అలరించింది. దీని స్ఫూర్తితోనే షారుఖ్ ఖాన్ రా వన్ తీసి బోల్తా పడటం వేరే విషయం. తిరిగి 2013లో క్రిష్ 3 వచ్చింది. కోయి మిల్ గయాని ఈ సిరీస్ లో కలిపేయడంతో రెండో భాగం స్థానంలో త్రీ పెట్టారు. ఇది కూడా పెద్ద హిట్టే. ఇదంతా జరిగిపోయి పన్నెండేళ్ళు గడిచిపోయాయి.
క్రిష్ 4 కోసం రాకేష్ రోషన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ కార్యరూపం దాల్చడం లేదు. ముంబై కథనాల ప్రకారం క్రిష్ 4 కోసం వేసుకున్న బడ్జెట్ 700 కోట్లట. అంత మొత్తం కుమ్మరించడానికి ఏ ప్రొడక్షన్ హౌస్ సిద్ధంగా లేకపోవడంతో ప్రారంభించలేకపోతున్నట్టు సమాచారం. దీని కోసం సిద్దార్థ్ ఆనంద్ ని రంగంలోకి దించిన హృతిక్ రోషన్ అతని మార్ ఫ్లిక్స్ సంస్థ ద్వారా బడ్జెట్ పెట్టించేందుకు ప్రయత్నించాడు. ఫైటర్ నుంచి వీళ్ళ స్నేహం బలపడింది. దర్శకత్వ బాధ్యతలు హృతిక్ తండ్రికి కాకుండా కరణ్ మల్హోత్రాకు ఇచ్చేందుకు ఎస్ అనుకున్నారు. తీరా చూస్తే సిద్దార్థ్ ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చాడని టాక్.
సో వార్ 2 విడుదలయ్యే దాకా వేచి చూడాలని రోషన్ ఫ్యామిలీ నిర్ణయించుకోవడంతో క్రిష్ 4కి పెద్ద బ్రేక్ పడింది. గత పదేళ్లలో ఎన్నో హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ మన దేశంలోనూ భారీ వసూళ్లు సాధించాయి. చిన్నా పెద్ద ప్రేక్షకులు లార్జర్ తాన్ లైఫ్ కథలకు అలవాటు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఇరవై సంవత్సరాల నాటి ఆలోచనలతో క్రిష్ 4 తీస్తే వర్కౌట్ కాదు. అయితే వార్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు హృతిక్ మార్కెట్ కి మరింత డిమాండ్ వస్తుందని, అప్పుడు ఏడు వందల కోట్లు పెద్ద మ్యాటర్ కాదని హృతిక్ భావిస్తున్నట్టు తెలిసింది. అయినా ఒకప్పటిలా క్రిష్ కు అంత ఫాలోయింగ్ ఉందా అంటే డౌటే.
This post was last modified on March 15, 2025 3:54 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…