నిర్మాతగా నాని జడ్జ్ మెంట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో కోర్ట్ రూపంలో మరోసారి ఋజువైపోయింది. ప్రీమియర్లతో కలిపి తొలి రోజు 8 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందనే రిపోర్ట్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమా బాగుంటుందని ఆశించినా వసూళ్లు ఇంత వేగంగా పికప్ అవుతాయని భావించలేదని, కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదని బయ్యర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిన్న హోలీ సెలవు రోజుని పూర్తిగా వాడుకుంది కోర్ట్ ఒకటే. బుక్ మై షోలో గత ఇరవై నాలుగు గంటల్లో లక్షా ఇరవై వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం దానికి నిదర్శనం.
ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కోర్ట్ మరింత బలంగా నిలవనుంది. స్క్రీన్లు పెంచుతున్నారు. ముందు తక్కువంచనా చేసి పరిమిత షోలు వేసిన బిసి సెంటర్లలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. స్టార్ క్యాస్టింగ్ లేకుండా ఒక సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామాకు ఇంత స్థాయి స్పందన నిజంగా రికార్డే. పోటీలో ఉన్న దిల్ రుబాకు ప్రతికూల ఫలితం రావడంతో అధిక శాతం ప్రేక్షకులకు నాని మూవీనే ఛాయస్ అవుతోంది. నన్ను నమ్మండి అంటూ న్యాచురల్ స్టార్ ఇచ్చిన హామీకి న్యాయం జరిగింది. దగ్గర్లో కొత్త రిలీజులు పెద్దగా లేవు కాబట్టి కోర్ట్ ఫైనల్ నెంబర్స్ ఇప్పుడే ఊహించి చెప్పడం కష్టం. భారీగా ఉండబోతున్నాయి.
ప్రియదర్శి, శివాజీతో పాటు హీరో హీరోయిన్లు హర్ష్, శ్రీదేవిలకు కోర్ట్ మంచి బ్రేక్ అవుతోంది. థియేటర్లలో సీన్లకు చప్పట్లు విజిల్స్ పడుతున్నాయి. కొన్ని లోపాలు,హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ జనం కోరుకున్న ఎంటర్ టైన్మెంట్ ని సీరియస్ గా ఇచ్చిన కోర్ట్ ఫైనల్ గా సూపర్ హిట్ ముద్ర దాటేసి బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతోంది. దర్శకుడు రామ్ జగదీశ్ కు అప్పుడే ఆఫర్లు మొదలయ్యాయని ఇన్ సైడ్ టాక్. ఇంకో వారం రోజులు దీని ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్న నాని తర్వాత హిట్ 3 ది థర్డ్ కేస్ పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంటున్నాడు. మొత్తానికి ప్రొడ్యూసర్ గా మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు.
This post was last modified on March 15, 2025 11:26 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…