అమితాబ్ బచ్చన్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలీవుడ్లోకి రంగప్రవేశం చేసిన నటుడు.. అభిషేక్ బచ్చన్. కానీ అతను తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోలేకపోయాడు. దాదాపు పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ స్టార్గా ఎదగలేకపోయాడు అభిషేక్. కానీ అప్పుడప్పుడూ తన నుంచి మంచి సినిమాలే వస్తున్నాయి. కానీ తండ్రిలా పెద్ద స్టార్ కాలేకపోయాడని అతడి మీద తరచుగా కౌంటర్లు పడుతూనే ఉంటాయి. తన బాక్సాఫీస్ ఫెయిల్యూర్ల మీద సెటైర్లూ మామూలే. ఫెయిల్యూర్లు, విమర్శలను తట్టుకోలేక అభిషేక్ బాగానే హర్టయ్యాడట. సినిమాలు మానేద్దామని, బాలీవుడ్ వదిలేద్దామని కూడా అనుకున్నాడట.
కానీ తన తండ్రే తనను ఆపినట్లు అభిషేక్ వెల్లడించాడు. ‘‘ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక కెరీర్ పరంగా ఎత్తు పల్లాలు ఎన్నో చూశా. నటుడిగా విభిన్న చిత్రాలతో అలరించాలన్నది నా ఆకాంక్ష. ఆ మేరకు ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ నటుడిగా ఆశించిన గుర్తింపు సంపాదించలేకపోయా. అందువల్ల చాలాసార్లు బాధ పడ్డా. సినిమాలు వదిలేసి ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోవాలనిపించింది. నటన మానేయాలని అనుకున్నాక నాన్నకు విషయం చెప్పాను. నా అభిప్రాయం విన్నాక ఆయన ఒకటే చెప్పారు.
‘ఇప్పుడే ప్రయాణం మొదలైంది. నువ్వు ఎంతో దూరం వెళ్లాలి. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు వస్తుంటాయి. అన్నింటి నుంచి కొత్త పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి సినిమా నుంచి ఒక విషయం నేర్చుకుంటూ సాగితే ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది సాధిస్తావు. కాబట్టి పోరాడుతూ ఉండు’ అని ఆయన అన్నారు. నాన్న మాటలు నాలో స్ఫూర్తి నింపాయి. నటనలో కొనసాగాలని ఫిక్సయ్యా’’ అని జూనియర్ బచ్చన్ చెప్పాడు. ఈ ప్రయాణంలో ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ ఎవ్వరూ సాధించలేరని అర్థం చేసుకున్నాకే తాను ఇండస్ట్రీలో కొనసాగగలుగుతున్నానని అభిషేక్ చెప్పాడు. అభిషేక్ నటించిన ‘బి హ్యాపీ’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
This post was last modified on March 14, 2025 7:33 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…