Movie News

రాజమౌళి కలను అమీర్ ఖాన్ తీర్చుకుంటాడా

దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్ యాక్టర్స్ ని అందులో భాగం చేసి మూడు నాలుగు భాగాలుగా రూపొందిస్తే చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుందని అభిమానులూ భావించారు. కానీ జక్కన్నకు అది సాధ్యపడలేదు. ఇప్పుడా స్వప్నాన్ని అమీర్ ఖాన్ నెరవేర్చుకునేలా ఉన్నాడు. తన 60వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ విశేషం పంచుకున్నాడు. మహాభారత స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయని, మొదటి సంవత్సరం ప్రోగ్రెస్ ని బట్టి ఐదేళ్లలో పూర్తి చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పాడు.

క్యాస్టింగ్ తదితర వివరాలు చెప్పలేదు కానీ అమీర్ మాటలను బట్టి చూస్తే పెద్ద ప్లాన్ కనిపిస్తోంది. ఆల్రెడీ రన్బీర్ కపూర్, సాయిపల్లవితో దర్శకుడు నితీష్ తివారి రామాయణం తీస్తున్నారు. ఇంకొకరు తీయాలనే ఆలోచనే చేయనంత గొప్పగా తెరకెక్కిస్తున్నానని ఇప్పటికే ఆయన ఊరించారు. రెండు భాగాల్లో మొదటి పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి రానుంది. ఇప్పుడు మహాభారతం అమీర్ చేతికి వెళ్తోంది. గతంలో అల్లు అరవింద్, మధు మంతెన లాంటి నిర్మాతలు ఈ గాథను వందల కోట్ల బడ్జెట్ తో తీయాలనుకున్నారు కానీ సాధ్యపడలేదు. తెలుగులో దానవీరశూరకర్ణ తర్వాత దాన్ని మించిన సినిమా రాలేదు.

టైం చాలా ఉంది కాబట్టి అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్టుని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. 2007 సూపర్ హిట్ తారే జమీన్ పర్ సీక్వెల్ సితారే జమీన్ పర్ ని వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న ఈ విలక్షణ నటుడికి లాల్ సింగ్ చద్దా పెద్ద షాక్ ఇచ్చింది. ఆరు పదుల వయసు వచ్చినా సరే అదే ఉత్సాహంతో సినిమాలు తీస్తున్న అమీర్ ఖాన్ ఇటీవలే కొడుకుతో తెరంగేట్రం చేయించాడు కానీ ఇటు థియేటర్, అటు ఓటిటి రెండింటిలోనూ చేదు ఫలితం దక్కింది. మహారాజ్, లవ్ యాపా డిజాస్టరయ్యాయి. తర్వాతి ప్రయత్నం బలంగా ఉండేలా పవర్ ఫుల్ కాంబో కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం.

This post was last modified on March 14, 2025 11:18 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

32 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago