ఒక్కోసారి దర్శకుల్లో ఎంత ప్రతిభ ఉన్నా ఒక్క డిజాస్టర్ లేదా ఫ్లాప్ వాళ్ళ కెరీర్ నే మారుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల ఆ కోవలోకే చెందుతారు. కొత్త బంగారు లోకంతో ఇండస్ట్రీకి వచ్చి డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకోవడం చిన్న విషయం కాదు. రెండో సినిమాకే టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ అని చెప్పుకునే వెంకటేష్ మహేష్ బాబులని ఒప్పించే ఫ్యామిలీ కథ రాసుకోవడం ఎందరో మహామహుల వల్లే కాలేదు. ఈ కారణంగానే వరుణ్ తేజ్ ని లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఆ బాధ్యతని శ్రీకాంత్ చేతిలో పెట్టారు. దానికతను బ్లాక్ బస్టర్ ఇవ్వలేదు కానీ హీరోలో విషయముందనే సందేశాన్ని ఇండస్ట్రీ, ప్రేక్షకులకు ఇవ్వగలిగాడు.
కానీ ఒక్క బ్రహ్మోత్సవం మొత్తం తలకిందులు చేసింది. మహేష్ బాబు ఎంతో నమ్మకంతో ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ చాలా చేదు ఫలితాన్ని ఇచ్చింది. దెబ్బకు ఆరు సంవత్సరాలకు పైగా పరిశ్రమకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నారప్ప రీమేక్ చేసినప్పటికీ ఆది ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ కావడంతో ప్రత్యేకంగా అతని ప్రతిభ హైలైట్ కాలేదు. ఇక పెదకాపు గురించి చెప్పనక్కర్లేదు. భారీ బిల్డప్ తో వచ్చిన ఈ విలేజ్ డ్రామా మరీ దారుణంగా పోయింది. ఇక్కడితో శ్రీకాంత్ అడ్డాల చాప్టర్ క్లోజనే అందరూ అనుకున్నారు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అతనిలో కొత్త ఆశలు చిగురించేలా చేసిందని ఇన్ సైడ్ టాక్.
గోదావరి నేపథ్యంలో అలాంటి అందమైన ఎమోషన్స్ ఉన్న కథ ఏదైనా ఉంటే చెప్పమని ఓ యూత్ హీరో అడుగుతున్నట్టు సమాచారం. అన్నీ సవ్యంగా జరిగి కోరుకున్న రీతిలో స్టోరీ కనక కుదిరితే శ్రీకాంత్ అడ్డాలతో చేయడానికి కిరణ్ అబ్బవరం సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. ఈ కారణంగా ఇద్దరు పలుమార్లు కలుసుకున్నారట. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ మొదటి రోజు చూడటమే కాక దానికి ముందు దిల్ రుబా ఈవెంట్లో కిరణ్ ప్రత్యేకంగా శ్రీకాంత్ ని మెచ్చుకోవడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. అయితే కంటెంట్ కరెక్ట్ గా వస్తేనే ఈ కాంబో కార్యరూపం దాలుస్తుందని అంతర్గత వర్గాలంటున్నాయి.
This post was last modified on March 13, 2025 9:14 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…