డార్లింగ్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ విడుదల ఎప్పుడనేది ఇంకా తేలలేదు కానీ టీమ్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను నిర్విరామంగా చేస్తూనే వస్తోంది. ఇంకా మూడు పాటల చిత్రీకరణ బ్యాలన్స్ ఉందని సమాచారం. షూట్ కొంత భాగం ఇంకా తీయాల్సి ఉంది. ఫౌజీ నుంచి ప్రభాస్ బ్రేక్ తీసుకుని రాగానే దీన్ని కొనసాగించబోతున్నారు. రిలీజ్ డేట్ సంగతి పక్కనపెడితే వచ్చే నెల టీజర్ ని భారీ ఎత్తున లాంచ్ చేసే దిశగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది. ప్రాజెక్టు గురించి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే విధంగా ఈవెంట్ ప్లాన్ చేస్తారని తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే ది రాజా సాబ్ లో చాలా ట్విస్టులు ఉంటాయనేది తెలిసిన విషయమే అయినా కీలకమైన ఒక ట్విస్టు ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడం ఖాయం. లీక్స్ ప్రకారం ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. టీమ్ అఫీషియల్ గా విడుదల చేసిన సిగరెట్ తాగే పోస్టర్ లో ఉన్నది ఠాగూర్ సాబట. అంటే ఆ బంగాళా యజమాని. రెండో క్యారెక్టర్ యంగ్ ప్రభాస్ అంటే టైటిల్ రోల్ చేస్తున్న ది రాజా సాబ్. వీళిద్దరి మధ్య సంబంధం తండ్రి కొడుకని వేరే చెప్పనక్కర్లేదు. తాతయ్యగా సంజయ్ దత్ దర్శనమిస్తాడు. ఈ ముగ్గురి మధ్య జరిగే కీలకమైన హారర్ డ్రామానే రాజా సాబ్ కోర్ పాయింట్ గా చెబుతున్నారు.
ఇది పక్కాని చెప్పలేం కానీ విశ్వసనీయ సమాచారం ప్రకారం టీజర్ లో దీని తాలూకు శాంపిల్స్ చూపించబోతున్నారు. నిధి అగార్వల్ తో పాటు మాళవిక మోహనన్ పాత్రలకు సంబంధించిన మలుపులు షాకింగ్ గా ఉంటాయట. తమన్ ఇచ్చిన పాటల్లో మూడు సాంగ్స్ పూర్తిగా మాస్ ని టార్గెట్ చేసుకుని మిర్చి నాటి ప్రభాస్ ని గుర్తు చేసేలా మరిపిస్తాయని తెలిసింది. ఈ ఏడాది ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు ది రాజా సాబ్ టీజర్ వేడుకలో ఖచ్చితంగా సమాధానం దొరకాలి. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి వీలైనంత సోలో డేట్ కోసం మేకర్స్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేరకు కొలిక్కి వస్తాయో వచ్చే నెల తేలొచ్చు.
This post was last modified on March 12, 2025 12:28 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…