ఇంత సన్నని దారం దొరికితే చాలు పెద్ద వస్త్రం కుట్టేయడం బాలీవుడ్ వర్గాల్లో సర్వ సాధారణం. కాకపోతే ఈసారి టాపిక్ తెలుగు హీరోయిన్ ముడిపడి ఉంది కాబట్టి దీని ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది. ఇటీవలే జరిగిన ఐఫా 2025 అవార్డుల్లో కార్తీక్ ఆర్యన్ కు భూల్ భులాయ్యా 3 పెర్ఫార్మన్స్ కు గాను అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అతని తల్లిని నిర్మాత కరణ్ జోహార్ ఒక సరదా ప్రశ్న అడిగాడు. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారని. దానికావిడ బదులు చెబుతూ ఇంట్లో డాక్టర్ ని డిమాండ్ చేస్తున్నారని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. శ్రీలీలకు దీనికి కనెక్షన్ ఏంటో చూద్దాం.
టాలీవుడ్ టాప్ కుర్చీ పోటీలో ఉన్న శ్రీలీల హిందీ డెబ్యూ కార్తీక్ ఆర్యన్ తో జరుగుతున్న సంగతి తెలిసిందే. తను ఎంబిబిఎస్ చేస్తున్నది కూడా ఓపెన్ సీక్రెట్. ఈ పరీక్షల కోసమే గుంటూరు కారం తర్వాత పెద్ద బ్రేక్ తీసుకుంది. ఇంకేముంది కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ కోరుకుంటున్నది శ్రీలీలనేని కొన్నిమీడియా కథనాలు వండి వడ్డించేశాయి. ఈ డౌట్ కరణ్ స్టేజి మీదే తీర్చాడు. నువ్వు నటిస్తోంది డాక్టర్ తోనే కదా అంటే దానికి కార్తీక్ ఆర్యన్ సమాధానమిస్తూ వాళ్ళు అడుగుతున్నది పనిచేసే ఆసుపత్రి వైద్యురాలినని, సినిమాల్లో నటించే డాక్టర్ కాదని క్లారిటీ ఇవ్వడంతో సందేహాలు తీరిపోయాయి.
ఆ వేడుకకు సంబంధించిన వీడియో పూర్తిగా చూస్తే తప్ప ఈ క్లారిటీ రాదు. అఫీషియల్ గా ఇంకా స్ట్రీమింగ్ మొదలవ్వని ఐఫా 2025 ఈవెంట్ లో చాలా విశేషాలు జరిగాయి. షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్ కలిసి దిల్ తో పాగల్ హైకు పాతికేళ్ల క్రితంలాగే అదిరిపోయే లైవ్ డాన్స్ చేయడం వాటిలో ఒకటి. వేడుకకు హాజరైన వాళ్ళు తీసిన సెల్ ఫోన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరలయ్యింది. ప్రస్తుతం తెలుగులోనే చాలా డిమాండ్ ఉన్న శ్రీలీల బాలీవుడ్ లోనూ ఋజువు చేసుకోవాలని పరుగులు పెడుతోంది. కార్తీక్ ఆర్యన్ తో చేస్తోంది ఆషీకీ 3 అనే ప్రచారం ఉంది కానీ ఇప్పటిదాకా టైటిల్ అయితే ప్రకటించలేదు.
This post was last modified on March 12, 2025 11:49 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…