లెజెండరీ తమిళ డైరెక్టర్ శంకర్తో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి సహా చాలామంది స్టార్ హీరోలు ప్రయత్నించారు. కానీ ఆయన ప్రైమ్లో ఉండగా ఎవరికీ దొరకలేదు. చివరికి రామ్ చరణ్తో ‘గేమ్ చేంజర్’ మూవీ చేశారు. కానీ ఆ చిత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ సంక్రాంతికి రిలీజై డిజాస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో చాలామంది పేరున్న ఆర్టిస్టులు నటించినప్పటికీ.. సరైన పాత్రలు పడలేదు. తెలుగులో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రియదర్శి ‘మచ్చా మచ్చా రా’ పాటలో కొన్ని క్షణాలు మాత్రమే కనిపించి మాయం అయ్యాడు. అలాంటి నటుడిని ఇలాగేనా చూపించేది అని అందరూ ఆశ్చర్యపోయారు.
వాస్తవం ఏంటంటే.. ‘గేమ్ చేంజర్’ మూవీ కోసం ప్రియదర్శి 25 రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నాడట. కానీ అతను నటించిన సీన్లన్నీ ఎడిటింగ్లో లేచిపోయాయట. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అవకాశం అనగానే ఎగ్జైట్ అయ్యానని.. తనది చిన్న పాత్రే అయినా సంతోషంగా ఒప్పుకున్నానని ప్రియదర్శి చెప్పాడు. ‘బలగం’ కంటే ముందే ఈ సినిమా ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. అప్పుడు తాను హీరో ఫ్రెండ్ పాత్రలే చేసేవాడినని.. ఇందులో కూడా అలాంటి పాత్రే ఇచ్చారని.. 25 రోజుల పాటు షూట్లో పాల్గొన్నానని ప్రియదర్శి తెలిపాడు. కానీ నిడివిని తగ్గించడంలో భాగంగా తన సీన్లన్నీ లేచిపోయానని.. అయినా సరే శంకర్ దర్శకత్వంలో నటించిన అనుభవం మాత్రం తనకు ప్రత్యేకమని ప్రియదర్శి తెలిపాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలన్నది తన కల అని.. అందుకోసం ఎంత ప్రయత్నిస్తున్నా వీలు కావడం లేదని ప్రియదర్శి చెప్పాడు. ‘ఆచార్య’లో ఓ పాత్ర కోసం తనను అడిగారని.. కానీ తర్వాత ఆ పాత్ర తీసేశారని.. ఆపై ‘వాల్తేరు వీరయ్య’లో తనకు ఛాన్స్ ఇవ్వమని దర్శకుడు బాబీని అడిగితే.. తనకు తగ్గ పాత్ర లేదని చెప్పాడని అన్నాడు. ‘భోళా శంకర్’లో ఛాన్స్ కోసం మెహర్ రమేష్ను అడిగినా కుదరలేదని.. ఇక అనిల్ రావిపూడి సినిమా కోసం కచ్చితంగా ప్రయత్నం చేస్తానంటూ మెగాస్టార్ మీద తన అభిమానాన్నిచాటుకున్నాడు దర్శి.
This post was last modified on March 11, 2025 7:53 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…