నిన్న రాబిన్ హుడ్ నుంచి అదిదా సర్ప్రైజ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కేతిక శర్మ నటించిన ఈ ప్రత్యేక గీతంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరోసారి డిస్కషన్ టాపిక్ గా మారింది. వెరైటీ కోసమో లేక యూత్ ని ఇలా అయితేనే ఆకట్టుకోగలమనే నమ్మకమో తెలియదు కానీ ఆయన కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు విమర్శలు తెస్తున్న దాఖలాలు లేకపోలేదు. మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్ టైంలో వచ్చిన నెగటివిటీ ఎంతో కొంత పబ్లిసిటీకి ఉపయోగపడింది కానీ ఆ హీరోల రేంజుకు అలాంటి వైరల్ ప్రమోషన్లు అవసరం లేదు. కాకపోతే అనుకోకుండా జరిగిన సోషల్ మీడియా ప్రచారం వల్ల చర్చలోకి వచ్చాయి.
ఇప్పుడీ రాబిన్ హుడ్ పాట కూడా వీటి సరసన చేరిపోయింది. సమస్య ఎక్కడొస్తుందంటే ఇలాంటి స్టెప్పులు పాపులరయ్యాయంటే రియాలిటీ డాన్స్ షోలు, ఇన్స్ టా రీల్స్ లో వీటిని అనుకరించే వాళ్ళు ఎక్కువైపోతారు. ముందు ముందు నృత్య దర్శకులు సైతం ఇవే ట్రెండ్ కాబోలని భావించి అలాంటివే ట్రై చేసే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా పాజిటివ్ గా మారితే పర్వాలేదు కానీ నెగటివ్ అయితేనే ఇబ్బంది. ఇప్పటికే మూడు సాంగ్స్ మీద ఒకే తరహా ఫీడ్ బ్యాక్ వచ్చింది కాబట్టి శేఖర్ మాస్టర్ సరిచేసుకోవాలనేది నెటిజెన్ల నుంచి వచ్చిన కామెంట్. ఏమైనా ఫలానా పాట ఉందనే టాక్ త్వరగా వెళ్ళిపోయిన మాట వాస్తవం.
దర్శకుడు వెంకీ కుడుముల గతంలో తీసిన ఛలో, భీష్మకు ఇలా జరగలేదు. వాటిని మించి రాబిన్ హుడ్ లో ఫన్ యాక్షన్ ఉంటాయని ఆయనిస్తున్న ధీమాకు అనుగుణంగానే నితిన్ ఈ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మ్యాడ్ స్క్వేర్, వీరధీరశూర పార్ట్ 2, ఎల్2 ఎంపురాన్ రూపంలో పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో గ్యారెంటీ హిట్టని చెబుతున్నాడు. ఇప్పటిదాకా రిలీజైన జివి ప్రకాష్ కుమార్ పాటలు మెల్లగా ఎక్కేస్తున్నాయి. అదిదా సర్ప్రైజు కొంచెం ఫాస్ట్ గా వెళ్లేలా ఉంది. పుష్ప 2లో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తే ఇప్పుడు శ్రీలీల మెయిన్ హీరోయిన్ సినిమాలో కేతిక శర్మ ఆడిపాడింది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…