నిన్న రాబిన్ హుడ్ నుంచి అదిదా సర్ప్రైజ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కేతిక శర్మ నటించిన ఈ ప్రత్యేక గీతంలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరోసారి డిస్కషన్ టాపిక్ గా మారింది. వెరైటీ కోసమో లేక యూత్ ని ఇలా అయితేనే ఆకట్టుకోగలమనే నమ్మకమో తెలియదు కానీ ఆయన కంపోజ్ చేసిన కొన్ని స్టెప్పులు విమర్శలు తెస్తున్న దాఖలాలు లేకపోలేదు. మిస్టర్ బచ్చన్, డాకు మహారాజ్ టైంలో వచ్చిన నెగటివిటీ ఎంతో కొంత పబ్లిసిటీకి ఉపయోగపడింది కానీ ఆ హీరోల రేంజుకు అలాంటి వైరల్ ప్రమోషన్లు అవసరం లేదు. కాకపోతే అనుకోకుండా జరిగిన సోషల్ మీడియా ప్రచారం వల్ల చర్చలోకి వచ్చాయి.
ఇప్పుడీ రాబిన్ హుడ్ పాట కూడా వీటి సరసన చేరిపోయింది. సమస్య ఎక్కడొస్తుందంటే ఇలాంటి స్టెప్పులు పాపులరయ్యాయంటే రియాలిటీ డాన్స్ షోలు, ఇన్స్ టా రీల్స్ లో వీటిని అనుకరించే వాళ్ళు ఎక్కువైపోతారు. ముందు ముందు నృత్య దర్శకులు సైతం ఇవే ట్రెండ్ కాబోలని భావించి అలాంటివే ట్రై చేసే అవకాశాలు లేకపోలేదు. ఇదంతా పాజిటివ్ గా మారితే పర్వాలేదు కానీ నెగటివ్ అయితేనే ఇబ్బంది. ఇప్పటికే మూడు సాంగ్స్ మీద ఒకే తరహా ఫీడ్ బ్యాక్ వచ్చింది కాబట్టి శేఖర్ మాస్టర్ సరిచేసుకోవాలనేది నెటిజెన్ల నుంచి వచ్చిన కామెంట్. ఏమైనా ఫలానా పాట ఉందనే టాక్ త్వరగా వెళ్ళిపోయిన మాట వాస్తవం.
దర్శకుడు వెంకీ కుడుముల గతంలో తీసిన ఛలో, భీష్మకు ఇలా జరగలేదు. వాటిని మించి రాబిన్ హుడ్ లో ఫన్ యాక్షన్ ఉంటాయని ఆయనిస్తున్న ధీమాకు అనుగుణంగానే నితిన్ ఈ సినిమా మీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. మ్యాడ్ స్క్వేర్, వీరధీరశూర పార్ట్ 2, ఎల్2 ఎంపురాన్ రూపంలో పోటీ ఉన్నప్పటికీ కంటెంట్ మీద నమ్మకంతో గ్యారెంటీ హిట్టని చెబుతున్నాడు. ఇప్పటిదాకా రిలీజైన జివి ప్రకాష్ కుమార్ పాటలు మెల్లగా ఎక్కేస్తున్నాయి. అదిదా సర్ప్రైజు కొంచెం ఫాస్ట్ గా వెళ్లేలా ఉంది. పుష్ప 2లో శ్రీలీల ఐటెం సాంగ్ చేస్తే ఇప్పుడు శ్రీలీల మెయిన్ హీరోయిన్ సినిమాలో కేతిక శర్మ ఆడిపాడింది.
This post was last modified on March 11, 2025 11:58 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…