సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్న కంగువకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పరాభవం దక్కిందో చూశాం. హీరో ఏమో కానీ ఆయన భార్య జ్యోతిక మాత్రం దీన్ని బ్యాడ్ మూవీ అనేందుకు ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు. సౌత్ లో ఎన్నో చెత్త సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచి వసూళ్లు సాధించాయని, వాటితో పోలిస్తే కంగువా చాలా నయమని, కానీ దారుణమైన రివ్యూలతో మీడియా అన్యాయం చేసిందని వాపోవడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొంత భాగం కనెక్ట్ కాని మాట నిజమే కానీ కంగువ టీమ్ ఎంత కష్టపడి ఉందో తనకు తెలుసంటూ వివరించింది.
ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే జ్యోతిక నటించిన వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది. దాని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగువ ప్రస్తావన వచ్చింది. అయితే ఆవిడ మిస్ అవుతున్న లాజిక్ ఒకటుంది. రివ్యూలు ఎలా వచ్చినా నిజంగా కంటెంట్ లో దమ్ముంటే ఆడియన్స్ ఏవీ పట్టించుకోకుండా థియేటర్లకు వస్తారని ఎన్నో సందర్భాల్లో ఋజువయ్యింది. పైగా కోట్లు ఖర్చు పెట్టారు, కష్టపడ్డారు అనే సింపతీ మీద జనం టికెట్లు కొనరు. తమ డబ్బుకు న్యాయం జరుగుతుందని భావిస్తేనే వస్తారు. లేదంటే ఎంత పెద్ద స్టార్ అయినా ట్రీట్ మెంట్ ఇలాగే ఉంటుంది.
మరో గమనించాల్సిన విషయం ఏంటంటే కంగువ లాగే గేమ్ ఛేంజర్, ఇండియన్ 2 లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే తరహా ఫలితం అందుకున్నాయి. కానీ ఆయా దర్శక నిర్మాతలు, దానికి సంబంధించిన వాళ్ళు ఎలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వలేదు సరికదా రిజల్ట్ గుర్తించి సైలెంట్ అయ్యారు. కంగువకు ఎన్ని కోట్లు అయ్యాయనే దానికన్నా పొరపాటు ఎక్కడ జరిగిందనేది గుర్తిస్తే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండొచ్చు. అంతే తప్ప రివ్యూలు, టాకులు ఒక పెద్ద హీరో సినిమాని చంపేయడం ఎక్కడా ఉండదు. సూర్య కొత్త సినిమా రెట్రో మే 1 విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీనికెలాంటి రిజల్ట్ వస్తుందో.
This post was last modified on March 11, 2025 11:49 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…