హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ వేసేవారు కానీ.. ‘చంద్రముఖి’ తర్వాత పరిస్థితి మారిపోయింది. అందులో జ్యోతిక దయ్యం పాత్రలో అద్భుత అభినయంతో ప్రశంసలు అందుకోవడంతో మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఈ పాత్రలు మంచి ఛాయిస్ అని హీరోయిన్లు భావించి వీటికి ఓకే చెప్పడం కామన్ అయింది. నయనతార, తమన్నా సహా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దయ్యాల పాత్రలు పోషించారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’లో ప్రభాస్ సైతం దయ్యంగా కనిపించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం దయ్యం క్యారెక్టర్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.కానీ ఆ ప్రచారాన్ని నిధి ఖండించింది. తాను ‘రాజా సాబ్’లో చేస్తున్నది దయ్యం క్యారెక్టర్ కాదని ఆమె స్పష్టం చేసింది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో తన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆమె చెప్పింది. అదే సమయంలో అది రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్ కాదని చెప్పిన నిధి.. ఇందులో పెర్ఫామెన్స్కు స్కోప్ ఉంటుందని నిధి తెలిపింది.
ఇక తాను నటిస్తున్న మరో భారీ చిత్రం హరిహర వీరమల్లు గురించి నిధి మాట్లాడుతూ.. ‘‘ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఆయన ఒక మేధావి. సాహిత్యం మీద ఎంతో పట్టు ఉంది. పవన్ గారు డిప్యూటీ సీఎం కాకముందే ఆయనతో షూటింగ్ చేశాను. ఎన్నికల సమయంలో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆగింది. డిప్యూటీ సీఎం అయ్యాక మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు. కానీ అప్పటికి, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారు’’ అని నిధి పేర్కొంది.
This post was last modified on March 11, 2025 5:28 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…