హార్రర్ సినిమాల్లో దయ్యాల పాత్రలు పోషించిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఒకప్పుడంటే దయ్యాల పాత్రలు చేయడానికి స్టార్ హీరోయిన్లు వెనుకంజ వేసేవారు కానీ.. ‘చంద్రముఖి’ తర్వాత పరిస్థితి మారిపోయింది. అందులో జ్యోతిక దయ్యం పాత్రలో అద్భుత అభినయంతో ప్రశంసలు అందుకోవడంతో మంచి పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఈ పాత్రలు మంచి ఛాయిస్ అని హీరోయిన్లు భావించి వీటికి ఓకే చెప్పడం కామన్ అయింది. నయనతార, తమన్నా సహా ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దయ్యాల పాత్రలు పోషించారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాజా సాబ్’లో ప్రభాస్ సైతం దయ్యంగా కనిపించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం దయ్యం క్యారెక్టర్ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.కానీ ఆ ప్రచారాన్ని నిధి ఖండించింది. తాను ‘రాజా సాబ్’లో చేస్తున్నది దయ్యం క్యారెక్టర్ కాదని ఆమె స్పష్టం చేసింది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో తన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ఆమె చెప్పింది. అదే సమయంలో అది రెగ్యులర్ గ్లామర్ క్యారెక్టర్ కాదని చెప్పిన నిధి.. ఇందులో పెర్ఫామెన్స్కు స్కోప్ ఉంటుందని నిధి తెలిపింది.
ఇక తాను నటిస్తున్న మరో భారీ చిత్రం హరిహర వీరమల్లు గురించి నిధి మాట్లాడుతూ.. ‘‘ఇదొక పీరియాడిక్ యాక్షన్ డ్రామా. పవన్ కళ్యాణ్ గారితో నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. ఆయన ఒక మేధావి. సాహిత్యం మీద ఎంతో పట్టు ఉంది. పవన్ గారు డిప్యూటీ సీఎం కాకముందే ఆయనతో షూటింగ్ చేశాను. ఎన్నికల సమయంలో బిజీగా ఉండడంతో షూటింగ్ ఆగింది. డిప్యూటీ సీఎం అయ్యాక మళ్లీ చిత్రీకరణలో పాల్గొన్నారు. కానీ అప్పటికి, ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ అలాగే ఉన్నారు’’ అని నిధి పేర్కొంది.
This post was last modified on March 11, 2025 5:28 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…