Movie News

ఆమె దర్శకత్వంలో సమంత మళ్లీ…

సమంత కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘ఓ బేబీ’ ఒకటి. ఒక కొరియన్ మూవీకి రీమేక్‌ అయినప్పటికీ… మన నేటివిటీకి తగ్గట్లు చాలా బాగా ఈ సినిమా తీసి మెప్పించింది నందిని రెడ్డి. సమంతతో ఆమె చేసిన తొలి చిత్రం ‘జబర్దస్త్’ డిజాస్టర్ అయినప్పటికీ.. ‘ఓ బేబీ’ మాత్రం ఒక క్లాసిక్‌గా నిలిచింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అది త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని నందిని రెడ్డి వెల్లడించింది. సమంతతో మళ్లీ తాను ఓ సినిమా తీస్తున్నట్లు ఆమె ప్రకటించింది.

ఐఫా వేడుకలో ‘సినిమాల్లో మహిళలు’ అనే టాపిక్ మీద మాట్లాడుతూ.. సమంత గురించి ప్రస్తావించిన నందిని రెడ్డి, తమ కలయికలో మళ్లీ ఓ సినిమా రాబోతున్న విషయాన్ని ధ్రువీకరించింది. అంతే కాక సమంత ప్రొడక్షన్లో ప్రకటించిన ‘మా ఇంటికి బంగారం’ మూవీకి సంబంధించి అప్‌డేట్ కూడా ఇచ్చింది నందిని. ఎప్పుడో ప్రకటించినా, తర్వాత అతీగతి లేకుండా పోయిందీ సినిమా. ఐతే దీని షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు నందిని తెలిపింది. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ మహిళలు, పురుషులు అని తేడా లేకుండా సమంత సమాన వేతనం ఇస్తోందని నందిని చెప్పింది.

సినీ రంగంలో మహిళలు, పురుషుల మధ్య ఉండే తేడాల గురించి మాట్లాడుతూ ఆమె ఈ విషయం వెల్లడించింది. తమ సినిమాలకు మంచి నిర్మాతలు దొరకాలంటే పురుషుల కంటే మహిళలు రెండింతలు నిరూపించుకోవాలని నందిని వ్యాఖ్యానించింది. ఒక పురుష దర్శకుడు 4 ఏళ్లలో సాధించేది, ఒక లేడీ డైరెక్టర్ సాధించాలంటే 8 ఏళ్లు పడుతోందని.. ఇందులో వేతన వ్యత్యాసం కూడా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

This post was last modified on March 10, 2025 11:38 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago