దిల్ రాజు బ్యానర్ లో జాతీయ అవార్డు సాధించడంతో పాటు కమర్షియల్ గానూ విజయం అందుకున్న శతమానం భవతికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి కొనసాగింపు తీయాలని రాజు గారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు కానీ కథ విషయం ఒక కొలిక్కి రాకపోవడంతో ఆలస్యమవుతోంది. నిన్న ఏడాది శతమానం భవతి నెక్స్ట్ పేజీ అంటూ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అందులో పేర్కొన్నారు. నటీనటులు, దర్శకుడు ఎవరో చెప్పకుండానే అంత కాన్ఫిడెంట్ గా ప్రకటన ఇచ్చారంటే చిన్న విషయం కాదు. కానీ దాని స్థానంలో సంక్రాంతికి వస్తున్నాంని తీసుకొచ్చారు.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం శతమానం భవతి నెక్స్ట్ పేజీకి అడుగులు పడుతున్నాయట. తమ కాంపౌండ్ హీరో ఆశిష్ తో తెరకెక్కించాలనేది దిల్ రాజు ఆలోచన. పెద్ద బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నప్పటికీ అతని కెరీర్ సరైన దిశలో వెళ్లట్లేదు. రౌడీ బాయ్స్ ఫ్లాప్ అయ్యింది. లవ్ మీ ఇఫ్ యు డేర్ దారుణంగా పోయింది. సుకుమార్ కథను ఇచ్చిన సెల్ఫిష్ మధ్యలో ఆగిపోయి రిపేర్ల పనిలో పడింది. వీటికన్నా ఏదైనా హోమ్లీ ఎంటర్ టైనర్ అయితే త్వరగా ప్రేక్షకులకు రీచ్ అవుతాడనే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. తొలి భాగం తీసిన సతీష్ వేగ్నేశ దర్శకుడిగా ఉండకపోవచ్చట.
ఆయన స్థానంలో కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారని వినిపిస్తోంది. 2026 సంక్రాంతికి తనకో స్లాట్ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. అది పెద్ద సినిమానా లేక శతమానం భవతి 2నా అనేది ఇప్పటికిప్పుడు తేలదు కానీ ఎంత కాంపిటేషన్ ఉన్నా సరే ఒకటి ఖచ్చితంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికైతే చిరంజీవి – అనిల్ రావిపూడి, జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలు ఫిక్సయ్యాయి. రవితేజ – కిషోర్ తిరుమల కూడా ఇదే సీజన్ టార్గెటట. ఒకవేళ శతమానం భవతి నెక్స్ట్ పేజీ కూడా తోడైతే పోటీ ఆసక్తికరంగా మారుతుంది. ముందైతే ప్రాజెక్టు ముందుకెళ్లాలి.
This post was last modified on March 9, 2025 11:55 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…