మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆయనతో పాటు ఇంకో నలుగురు సంతానం అన్న సంగతి తెలిసిందే. నాగబాబు, పవన్ కళ్యాణ్లకు తోడు ఇద్దరు సోదరీమణులున్నారు. ఐతే వీరితో పాటు చిరు తల్లిదండ్రులకు ఇంకో ముగ్గురు సంతానం కూడా కలిగారట. కానీ ఆ ముగ్గురూ రకరకాల కారణాలతో చనిపోయిన విషయాన్ని చిరు ‘ఉమెన్స్ డే’ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను ఆరో తరగతిలో ఉండగా తన సోదరి చనిపోవడంతో తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘అమ్మకు ఇప్పుడు మేం అయిదుగురు బిడ్డలం. కానీ మరో ముగ్గురు చిన్న వయసులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మే అన్నీ చూసుకునేది. నేను చిన్నప్పటి నుంచి అమ్మకు పనుల్లో సాయం చేస్తుండేవాడిని. నేను ఆరో తరగతిలో ఉండగా రమ అనే నా సోదరి అనారోగ్యం పాలైంది. దీంతో తనను నేను, అమ్మ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లాం. నాన్నకు విషయం తెలియదు. రెండు రోజుల తర్వాత నా సోదరి చనిపోయింది. తనను చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాం. చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో తర్వాతి కార్యక్రమాలు పూర్తి చేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం తెలిసింది. కానీ ఆయన వచ్చేసరికే అంతా అయిపోయంది. ఆ క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది’’ అని చిరు వెల్లడించారు.
ఇక తాను మూడేళ్ల వయసున్నపుడు తప్పిపోయిన విషయాన్ని కూడా చిరు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘సరదాగా ఆడుకుంటూ రోడ్డు మీదికి వచ్చేసి.. ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ రోడ్డు మీదే కూర్చుండిపోయాను. అక్కడే ఉన్న ఒకాయన నన్ను చూసి తన కొలిమి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అమ్మ వచ్చేసరికినేను ఒళ్లంతా మసి పూసుకుని కూర్చున్నా. దీంతో అమ్మ నన్ను చూసి గుర్తు పట్టలేకపోయింది. వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసింది. కానీ తర్వాత ఎందుకో అనుమానం వచ్చి దగ్గరగా చూసి నన్ను గుర్తు పట్టింది. తర్వాత ఇంటికి తీసుకెళ్లితాళ్లతో కట్టేసిందట’’ అని చిరు చెప్పారు.
This post was last modified on March 9, 2025 4:56 am
కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…
నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్…
పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…