Movie News

చిరు ఆరో తరగతిలో ఉండగా ఓ పెద్ద విషాదం

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆయనతో పాటు ఇంకో నలుగురు సంతానం అన్న సంగతి తెలిసిందే. నాగబాబు, పవన్ కళ్యాణ్‌లకు తోడు ఇద్దరు సోదరీమణులున్నారు. ఐతే వీరితో పాటు చిరు తల్లిదండ్రులకు ఇంకో ముగ్గురు సంతానం కూడా కలిగారట. కానీ ఆ ముగ్గురూ రకరకాల కారణాలతో చనిపోయిన విషయాన్ని చిరు ‘ఉమెన్స్ డే’ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను ఆరో తరగతిలో ఉండగా తన సోదరి చనిపోవడంతో తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘‘అమ్మకు ఇప్పుడు మేం అయిదుగురు బిడ్డలం. కానీ మరో ముగ్గురు చిన్న వయసులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మే అన్నీ చూసుకునేది. నేను చిన్నప్పటి నుంచి అమ్మకు పనుల్లో సాయం చేస్తుండేవాడిని. నేను ఆరో తరగతిలో ఉండగా రమ అనే నా సోదరి అనారోగ్యం పాలైంది. దీంతో తనను నేను, అమ్మ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లాం. నాన్నకు విషయం తెలియదు. రెండు రోజుల తర్వాత నా సోదరి చనిపోయింది. తనను చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాం. చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో తర్వాతి కార్యక్రమాలు పూర్తి చేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం తెలిసింది. కానీ ఆయన వచ్చేసరికే అంతా అయిపోయంది. ఆ క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది’’ అని చిరు వెల్లడించారు.

ఇక తాను మూడేళ్ల వయసున్నపుడు తప్పిపోయిన విషయాన్ని కూడా చిరు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘సరదాగా ఆడుకుంటూ రోడ్డు మీదికి వచ్చేసి.. ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ రోడ్డు మీదే కూర్చుండిపోయాను. అక్కడే ఉన్న ఒకాయన నన్ను చూసి తన కొలిమి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అమ్మ వచ్చేసరికినేను ఒళ్లంతా మసి పూసుకుని కూర్చున్నా. దీంతో అమ్మ నన్ను చూసి గుర్తు పట్టలేకపోయింది. వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసింది. కానీ తర్వాత ఎందుకో అనుమానం వచ్చి దగ్గరగా చూసి నన్ను గుర్తు పట్టింది. తర్వాత ఇంటికి తీసుకెళ్లితాళ్లతో కట్టేసిందట’’ అని చిరు చెప్పారు.

This post was last modified on March 9, 2025 4:56 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chiranjeevi

Recent Posts

కాంట్రావర్సీ ముదురుతున్న కేరళ స్టోరీ 2

వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…

5 minutes ago

సుప్రీం వ్యాఖ్యలను రాష్ట్రాలు ఎలా తీసుకుంటాయి?

రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…

42 minutes ago

శంకర్‌ డ్రీమ్ ప్రాజెక్టులో ధనుష్?

ఒకప్పుడు శంకర్‌తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…

2 hours ago

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 hours ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

2 hours ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

3 hours ago