మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆయనతో పాటు ఇంకో నలుగురు సంతానం అన్న సంగతి తెలిసిందే. నాగబాబు, పవన్ కళ్యాణ్లకు తోడు ఇద్దరు సోదరీమణులున్నారు. ఐతే వీరితో పాటు చిరు తల్లిదండ్రులకు ఇంకో ముగ్గురు సంతానం కూడా కలిగారట. కానీ ఆ ముగ్గురూ రకరకాల కారణాలతో చనిపోయిన విషయాన్ని చిరు ‘ఉమెన్స్ డే’ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను ఆరో తరగతిలో ఉండగా తన సోదరి చనిపోవడంతో తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘అమ్మకు ఇప్పుడు మేం అయిదుగురు బిడ్డలం. కానీ మరో ముగ్గురు చిన్న వయసులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మే అన్నీ చూసుకునేది. నేను చిన్నప్పటి నుంచి అమ్మకు పనుల్లో సాయం చేస్తుండేవాడిని. నేను ఆరో తరగతిలో ఉండగా రమ అనే నా సోదరి అనారోగ్యం పాలైంది. దీంతో తనను నేను, అమ్మ కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లాం. నాన్నకు విషయం తెలియదు. రెండు రోజుల తర్వాత నా సోదరి చనిపోయింది. తనను చేతుల్లోకి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లాం. చుట్టుపక్కల వాళ్లు సాయం చేయడంతో తర్వాతి కార్యక్రమాలు పూర్తి చేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం తెలిసింది. కానీ ఆయన వచ్చేసరికే అంతా అయిపోయంది. ఆ క్షణాలు నాకిప్పటికీ గుర్తున్నాయి. తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది’’ అని చిరు వెల్లడించారు.
ఇక తాను మూడేళ్ల వయసున్నపుడు తప్పిపోయిన విషయాన్ని కూడా చిరు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘సరదాగా ఆడుకుంటూ రోడ్డు మీదికి వచ్చేసి.. ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ రోడ్డు మీదే కూర్చుండిపోయాను. అక్కడే ఉన్న ఒకాయన నన్ను చూసి తన కొలిమి దగ్గరికి తీసుకెళ్లారు. ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అమ్మ వచ్చేసరికినేను ఒళ్లంతా మసి పూసుకుని కూర్చున్నా. దీంతో అమ్మ నన్ను చూసి గుర్తు పట్టలేకపోయింది. వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసింది. కానీ తర్వాత ఎందుకో అనుమానం వచ్చి దగ్గరగా చూసి నన్ను గుర్తు పట్టింది. తర్వాత ఇంటికి తీసుకెళ్లితాళ్లతో కట్టేసిందట’’ అని చిరు చెప్పారు.
This post was last modified on March 9, 2025 4:56 am
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…