వాణిజ్య ప్రకటనల్లో స్టార్ హీరోలు నటించడం కొత్తేమీ కాదు. మహేష్ బాబు ఎన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడో అభిమానులే ఠక్కున చెప్పలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య ఆర్ఆర్ఆర్ టైంలో యాడ్స్ చేయలేదు కానీ తాజాగా మళ్ళీ మొదలుపెట్టాడు. అందులో భాగంగా నిన్న ఆన్ లైన్ సరుకులను డెలివరీ చేసే జెప్టో యాడ్ లో కనిపించాడు. డైరెక్టర్ కొంచెం ఎక్కువ క్రియేటివిటీ చూపించడంతో వీడియో వెరైటీగా అనిపించింది. అయితే అధిక శాతం మాట్లాడుకున్న అంశం జూనియర్ హెయిర్ స్టైల్, లుక్స్ గురించే. సోషల్ మీడియాలో ఎక్కువగా యాంటీ ఫ్యాన్స్ నెగటివిటీ కనిపించడం చర్చకు దారి తీసింది.
నిజానికి తారక్ ఇప్పుడు వార్ 2 చివరి దశ షూటింగ్ లో ఉన్నాడు. బయట ఎయిర్ పోర్ట్స్, ఫంక్షన్లలో కనిపించడం పక్కనపెడితే ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం ప్రత్యేకమైన లుక్స్ మైంటైన్ చేస్తున్నాడు. అవి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇటీవలే హృతిక్ రోషన్ తో కలిసి పాట డాన్స్ లో పాల్గొంది కూడా దీంతోనే. ఇలాంటి టైంలో జెప్టో షూట్ రావడంతో ఏదోలా మేనేజ్ చేసుకుని కొంచెం కొత్తగా ట్రై చేద్దామని క్రాఫు మార్చిన జుత్తుతో కనిపించాడు. కానీ ఆశించినంత పాజిటివ్ గా వెళ్ళలేదు. మాములుగా ఎంత యాడ్ అయినా సరే లుక్ టెస్ట్ చేస్తారు. మరి దీని విషయంలో సీరియస్ గా చూడలేదేమో.
ఇదంతా పక్కనపెడితే కేవలం కొన్ని సెకండ్ల పాటు వచ్చే యాడ్ మీద ఇంత శల్యపరీక్ష అవసరమా అంటే లేదనే చెప్పాలి. ఆ మధ్య చిరంజీవి ఒక పాల ప్యాకెట్ల ప్రకటనలో మాస్ గా కనిపిస్తే దాని మీద కూడా కామెంట్స్ వచ్చాయి. అభిమానులు మరీ ఎక్కువ ఊహించుకోవడమో లేదా యాంటీ ఫ్యాన్స్ అవసరానికి మించి ట్రోలింగ్ కు దిగడమో చేసినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడొచ్చిన జెప్టో యాడ్ ఇంకా మొదటిదేనట. రెండోది త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. వార్ 2 ప్రమోషన్లు వేసవిలో మొదలుపెట్టబోతున్నారు. అప్పుడు అందరి డౌట్లు జూనియర్ తీర్చేయొచ్చు.
This post was last modified on March 8, 2025 5:28 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…