మొన్న జనవరి నెలలో విడుదలైన మలయాళం మూవీ రేఖా చిత్రం సంచలన విజయం సాధించింది. సంక్రాంతి పోటీ ఉన్నప్పటికీ ఒరిజినల్ వెర్షన్ కు హైదరాబాద్ లో కాసిన్ని స్క్రీన్లు ఇస్తే రోజుల తరబడి హౌస్ ఫుల్స్ పడ్డాయి. కేవలం పది కోట్ల బడ్జెట్ లోపే తీస్తే యాభై కోట్లకు పైగా వసూలు చేసి సెన్సషన్ అయ్యింది. తెలుగు డబ్బింగ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూశారు. థియేట్రికల్ గా జరక్కపోయినా ఓటిటిలో ఆ ముచ్చట తీరింది. నిన్నటి నుంచి సోని లివ్ లో రేఖా చిత్రం బహు భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన ఈ రేఖా చిత్రంలో అంత గొప్పగా ఏముందో చూద్దాం.
రాజేంద్రన్ (సిద్ధికి) అనే ధనవంతుడు ఒక అడవిలోకి వెళ్లి ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య చేసుకుంటాడు. స్నేహితులతో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని హత్య చేసి పూడ్చి పెట్టడమే కారణంగా చెబుతాడు. ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి పూనుకుంటాడు ఎస్ఐ వివేక్ (అసిఫ్ అలీ). దొరికిన వివరాల ప్రకారం తవ్వి చూడగా 1985లో కనిపించకుండా పోయిన రేఖా (అనస్వర రాజన్) మృతదేహమని తేలుతుంది. జూనియర్ ఆర్టిస్ట్, మమ్ముట్టి వీరాభిమానిగా ఇండస్ట్రీకి వచ్చిన రేఖ అసలెందుకు హత్యకు గురయ్యింది, దాని వెనుక దిగ్భ్రాంతి కలిగించే హంతకులు ఎవరనేది అసలు స్టోరీ.
దర్శకుడు జోఫీన్ టి చాకో తీసుకున్న పాయింట్ రెగ్యులర్ క్రైమే అయినప్పటికీ దానికి మమ్ముట్టి పాత సినిమా షూటింగ్ నేపధ్యాన్ని జోడించడం రేఖా చిత్రంకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. మల్లువుడ్ సినిమాల్లో సాధారణంగా చూసే ల్యాగ్ ఇందులోనూ కనిపిస్తుంది. కాకపోతే అసలు విలన్ ఎవరనేది ఊహించకుండా, సరైన సమయంలో ట్విస్టులను విప్పుకుంటూ వెళ్లిన విధానం బాగుంటుంది. అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించే రేంజ్ లో స్క్రీన్ ప్లే ఉండదు కానీ ఆసక్తి తగ్గకుండా నడిపించడంలో సక్సెసయ్యింది. ఆర్టిస్టుల నటన పెద్ద ప్లస్. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకు ఓకే కానీ సగటు ఆడియన్స్ కి మరీ ఎగ్జైట్ మెంట్ అనిపించదు.
This post was last modified on March 7, 2025 5:03 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…