బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్సి 16 షూటింగ్ శరవేగంగా జరుగుతుండటంతో సుకుమార్ తో ప్లాన్ చేసుకున్న ఆర్సి 17 పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం క్యాస్టింగ్ మీద దృష్టి పెట్టిన టీమ్ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిమీద మల్లగుల్లాలు పడుతోందని సమాచారం. ఒక ఆప్షన్ గా సమంత పేరుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఈ ముగ్గురి కాంబోలో రంగస్థలం ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మళ్ళీ చెప్పనక్కర్లేదు. చిట్టిబాబు, రామలక్ష్మి కెమిస్ట్రీని క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. ఆ మాటకొస్తే ఈ జంటను మరిపించే మేజిక్ మరో దర్శకుడు చరణ్ కు ఇవ్వలేదు.
అందుకే సామ్ అయితే ఎలా ఉంటుందనే కోణంలో సుకుమార్ సీరియస్ గా ఆలోచిస్తున్నారట. కాకపోతే సినిమాలు చేయడం తగ్గించేసిన సమంత బ్రాండ్ ప్యాన్ ఇండియా స్థాయిలో ఏ మేరకు ఉపయోగపడుతుందనేది విశ్లేషించుకోవాలి. పుష్పలో ఐటెం సాంగ్, సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ విషయంలో సామ్ ముందంజలోనే ఉంది కానీ ప్రస్తుతం కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఒకవేళ నిజంగా సుకుమార్ అడిగితే మాత్రం నో అనకపోవచ్చు. ప్రస్తుతానికీ వార్త చక్కర్లయితే కొడుతోంది కాబట్టి సుకుమార్ మనసులో ఎవరున్నారో ఆయనగా చెబితే తప్ప ఇప్పట్లో బయటికి రాదు.
మరో ఆప్షన్ గా రష్మిక మందన్నని చూస్తున్నారట కానీ ఎంతమేరకు నిజమవుతుందో చెప్పలేం. ఇప్పటికైతే సుకుమార్ తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఒకవేళ బుచ్చిబాబు సినిమా కనక అక్టోబర్ లోగా అయిపోతే కనీసం జనవరి నుంచి ఆర్సి 17 సెట్స్ పైకి తీసుకెళ్లాలి. గేమ్ ఛేంజర్ కోసం విలువైన మూడేళ్ళ కాలాన్ని వృథా చేసుకున్న రామ్ చరణ్ ఈసారి అలా రిపీట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎక్కువ గ్యాప్ లేకుండా వేగంగా సినిమాలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. సుకుమార్ స్టయిల్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది కాబట్టి త్వరగా మొదలుపెట్టాలనేది ప్లాన్.
This post was last modified on March 7, 2025 10:20 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…