సౌత్ హీరోల మాస్ సినిమాల్లో హీరోయిజం ఏ లెవెల్లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లు ఒక దెబ్బ కొడితే రౌడీ వెళ్లి పది మీటర్ల అవతల పడాల్సిందే. గాల్లో తేలిపోవాల్సిందే. గోడలు సైతం బద్దలు కావాల్సిందే. ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ ఏకంగా చేతి బోరును పీకి విలన్ మీదికి దూసుకెళ్లిపోతాడు. అది చూసి ఇదెలా సాధ్యం అనుకోలేదు మన ప్రేక్షకులు. వారెవా ఏం హీరోయిజం అనే అనుకున్నారు.
ఇలా హీరోలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విన్యాసాలు చేస్తూనే ఉండాలి. చేతుల్లోకి కొత్త కొత్త ఆయుధాలు తీసుకుని విలన్ల మీదికి దూసుకెళ్లిపోవాలి. తాజాగా తెలుగు వాళ్లకు బాగా పరిచయమున్న తమిళ కథానాయకుడు కార్తి ఇప్పటిదాకా ఎవ్వరూ పట్టని ఆయుధాన్ని చేతికి తీసుకున్నాడు. విద్యుత్ ప్రవహించే హై టెన్షన్ వైర్ను అతను చేతికి తీసుకోవడం విశేషం.
గత ఏడాది ‘ఖైదీ’తో మెప్పించిన కార్తి.. దాని తర్వాత భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ‘సుల్తాన్’ అనే సినిమా మొదలుపెట్టాడు. ప్రముఖ తమిళ నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ రోజే ఫస్ట్ లుక్ లాంచ్ చేశాడు. ఇందులో కార్తి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ తరం నగర కుర్రాళ్లకు ప్రతినిధిలా కనిపిస్తున్న కార్తి సీరియస్గా చూస్తూ హై టెన్షన్ వైర్ను చేత్తో పట్టుకుని ఉన్నాడు. వెనుక కరెంటు పోల్స్ కనిపిస్తున్నాయి. మరీ విలన్లను కొట్టడానికి ఇలాంటి ఆయుధమా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు కానీ.. మాస్ను ఆకట్టుకోవాలంటే ఇలాంటివే అవసరం. ‘సుల్తాన్’ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నాడు నిర్మాత. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా ఈ చిత్రంతోనే తమిళంలో అడుగు పెడుతుండటం విశేషం.
This post was last modified on October 26, 2020 7:10 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…