టాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా.. యల్లమ్మ. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు రూపొందించనున్న రెండో చిత్రమిది. ‘బలగం’ రిలీజైన కొన్ని నెలలకే ఈ సినిమా తెరపైకి వచ్చింది. నాని హీరోగా ఈ సినిమా తీయడానికి వేణు రంగం సిద్ధం చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. నాని స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందకపోవడమే కారణమని భావించారు. అంతటితో సినిమా అటకెక్కేస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత నితిన్ పేరు తెరపైకి వచ్చింది. దిల్ రాజు బేనర్లోనే ఈ యంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు వేణు. ఎట్టకేలకు ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. మరి కొన్ని రోజుల్లోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో ‘యల్లమ్మ’ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారట. ఆ స్థాయి సంగీత దర్శకులు.. వేణు డైరెక్ట్ చేయబోయే సినిమాకు పని చేయడం అంటే చాలా పెద్ద విశేషమే. ఈ అప్డేట్ బయటికి రాగానే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎగ్జైట్మెంట్తో ఒక పోస్ట్ పెట్టాడు. దర్శకుడిగా హరీష్ తొలి చిత్రం ‘షాక్’కు అజయ్-అతుల్ పని చేశారు. డిజాస్టర్ అయిన ఆ సినిమాలో ‘మధురం మధురం’ పాట పెద్ద హిట్ అయింది. ఆ పాటను కంపోజ్ చేసింది ఈ సంగీత దర్శక ద్వయమే.
ఈ విషయం గుర్తు చేసుకుంటూ నోస్టాల్జిక్గా ఫీలయ్యాడు హరీష్. మళ్లీ ఇంత కాలానికి వాళ్లిద్దరూ ఓ తెలుగు సినిమాకు పని చేస్తుండడం.. పైగా హరీష్ సొంత బేనర్లా ఫీలయ్యే ఎస్వీసీ సంస్థలో రూపొందబోయే చిత్రం కావడం తన ఎగ్జైట్మెంట్కు కారణం కావచ్చు. మ్యూజిక్ గురించి ఈ అప్డేట్తో ‘యల్లమ్మ’కు మంచి హైప్ వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 6, 2025 5:55 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…