టాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా.. యల్లమ్మ. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు రూపొందించనున్న రెండో చిత్రమిది. ‘బలగం’ రిలీజైన కొన్ని నెలలకే ఈ సినిమా తెరపైకి వచ్చింది. నాని హీరోగా ఈ సినిమా తీయడానికి వేణు రంగం సిద్ధం చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. నాని స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందకపోవడమే కారణమని భావించారు. అంతటితో సినిమా అటకెక్కేస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత నితిన్ పేరు తెరపైకి వచ్చింది. దిల్ రాజు బేనర్లోనే ఈ యంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు వేణు. ఎట్టకేలకు ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. మరి కొన్ని రోజుల్లోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో ‘యల్లమ్మ’ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారట. ఆ స్థాయి సంగీత దర్శకులు.. వేణు డైరెక్ట్ చేయబోయే సినిమాకు పని చేయడం అంటే చాలా పెద్ద విశేషమే. ఈ అప్డేట్ బయటికి రాగానే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎగ్జైట్మెంట్తో ఒక పోస్ట్ పెట్టాడు. దర్శకుడిగా హరీష్ తొలి చిత్రం ‘షాక్’కు అజయ్-అతుల్ పని చేశారు. డిజాస్టర్ అయిన ఆ సినిమాలో ‘మధురం మధురం’ పాట పెద్ద హిట్ అయింది. ఆ పాటను కంపోజ్ చేసింది ఈ సంగీత దర్శక ద్వయమే.
ఈ విషయం గుర్తు చేసుకుంటూ నోస్టాల్జిక్గా ఫీలయ్యాడు హరీష్. మళ్లీ ఇంత కాలానికి వాళ్లిద్దరూ ఓ తెలుగు సినిమాకు పని చేస్తుండడం.. పైగా హరీష్ సొంత బేనర్లా ఫీలయ్యే ఎస్వీసీ సంస్థలో రూపొందబోయే చిత్రం కావడం తన ఎగ్జైట్మెంట్కు కారణం కావచ్చు. మ్యూజిక్ గురించి ఈ అప్డేట్తో ‘యల్లమ్మ’కు మంచి హైప్ వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 6, 2025 5:55 pm
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…