టాలీవుడ్లో చాన్నాళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా.. యల్లమ్మ. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ వేణు రూపొందించనున్న రెండో చిత్రమిది. ‘బలగం’ రిలీజైన కొన్ని నెలలకే ఈ సినిమా తెరపైకి వచ్చింది. నాని హీరోగా ఈ సినిమా తీయడానికి వేణు రంగం సిద్ధం చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమాను కన్ఫమ్ చేశాడు. కానీ మధ్యలో ఏమైందో ఏమో.. ఈ సినిమా ముందుకు కదల్లేదు. నాని స్క్రిప్టు విషయంలో సంతృప్తి చెందకపోవడమే కారణమని భావించారు. అంతటితో సినిమా అటకెక్కేస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత నితిన్ పేరు తెరపైకి వచ్చింది. దిల్ రాజు బేనర్లోనే ఈ యంగ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు వేణు. ఎట్టకేలకు ఆ సినిమా పట్టాలెక్కబోతోంది. మరి కొన్ని రోజుల్లోనే చిత్రీకరణ ఆరంభం కానుంది.
ఈ నేపథ్యంలో ‘యల్లమ్మ’ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారట. ఆ స్థాయి సంగీత దర్శకులు.. వేణు డైరెక్ట్ చేయబోయే సినిమాకు పని చేయడం అంటే చాలా పెద్ద విశేషమే. ఈ అప్డేట్ బయటికి రాగానే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎగ్జైట్మెంట్తో ఒక పోస్ట్ పెట్టాడు. దర్శకుడిగా హరీష్ తొలి చిత్రం ‘షాక్’కు అజయ్-అతుల్ పని చేశారు. డిజాస్టర్ అయిన ఆ సినిమాలో ‘మధురం మధురం’ పాట పెద్ద హిట్ అయింది. ఆ పాటను కంపోజ్ చేసింది ఈ సంగీత దర్శక ద్వయమే.
ఈ విషయం గుర్తు చేసుకుంటూ నోస్టాల్జిక్గా ఫీలయ్యాడు హరీష్. మళ్లీ ఇంత కాలానికి వాళ్లిద్దరూ ఓ తెలుగు సినిమాకు పని చేస్తుండడం.. పైగా హరీష్ సొంత బేనర్లా ఫీలయ్యే ఎస్వీసీ సంస్థలో రూపొందబోయే చిత్రం కావడం తన ఎగ్జైట్మెంట్కు కారణం కావచ్చు. మ్యూజిక్ గురించి ఈ అప్డేట్తో ‘యల్లమ్మ’కు మంచి హైప్ వస్తుందనడంలో సందేహం లేదు.
This post was last modified on March 6, 2025 5:55 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…