వైవిధ్యం ఉంటే చిన్నా పెద్దా తేడా లేకుండా సినిమాలు ఆదరణ పొందడం బాక్సాఫీస్ కు అనుభవమే. సంతాన ప్రాప్తిరస్తు అలాంటి ప్రయత్నంగానే కనిపిస్తోంది. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ని మధురా శ్రీధర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కాన్సెప్ట్ ఏంటో దాచకుండా ట్రైలర్ లో చెప్పేయడంతో ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేయడానికి అవకాశం దొరికినట్టయ్యింది. కలర్ ఫోటో, సమ్మతమే తర్వాత చాందిని చౌదరికి దొరికిన లీడ్ రోల్ ఇదే. క్యాస్టింగ్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు ఫన్ కి పెద్ద పీఠ వేసిన వైనం ట్రయిలర్లో కనిపించింది.
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే ఒక యువకుడి (విక్రాంత్) కి ప్రేమ,పెళ్లి పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. ఇష్టపడిన అమ్మాయి (చాందిని చౌదరి) ని కోరి జీవిత భాగస్వామిని చేసుకుంటాడు. ఆమె తండ్రి (మురళీధర్ గౌడ్) ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాటుకుంటాడు. అయితే సంతానం కలిగే విషయంలో వీర్య కణాలు తక్కువగా ఉండటం వల్ల కుర్రాడికి చిక్కు ఎదురవుతుంది. భార్యని వంద రోజుల్లో గర్భవతిని చేసే సవాల్ స్వీకరిస్తాడు. డాక్టర్లు, ప్రకృతి వైద్యులను కలుస్తాడు. అసలు చిక్కు ఇక్కడి నుంచి మొదలవుతుంది. సున్నితమైన సమస్యను ఈ జంట ఎలా ఎదురుకుందనేదే కథ.
వినోదంతో పాటు సందేశం కూడా జొప్పించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి సెన్సిటివ్ పాయింట్ కి కామెడీ జోడించడం బాగుంది. హీరో హీరోయిన్ జోడి ఫ్రెష్ గా అనిపించడంతో పాటు కళ్యాణ్ రాఘవ్ సంభాషణలు చమత్కారంగా ఉన్నాయి. మగాడి జీవితంలో సులభమైన సంతాన ప్రక్రియను క్లిష్టంగా మార్చారంటూ వెన్నెల కిషోర్ తో చెప్పిన డైలాగు ద్వారా సినిమా ఉద్దేశమేంటో చెప్పేశారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, హర్షవర్ధన్, జీవన్ కుమార్, అభయ్, కిరిటీ ఇతర తారాగణం. సునీల్ కశ్యప్ సంగీతం, మహీ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చిన సంతాన ప్రాప్తిరస్తు త్వరలోనే విడుదల కానుంది.
This post was last modified on March 5, 2025 4:14 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…