Movie News

వాట్…రష్మికకు గుణపాఠం చెబుతారా

ఆ మధ్య ఛావా ఆడియో ఈవెంట్లో తనది హైదరాబాద్ గా చెప్పుకున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో కన్నడిగుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. మూలాలు మర్చిపోయి ఇతర భాషలకు అంకితమైపోయిందంటూ కొందరు ట్వీట్లు పోస్టులు చేశారు. దానికి శ్రీవల్లి స్పందించలేదు కానీ తాజాగా రాజకీయ నాయకులు ఈ లిస్టులో చేరిపోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం మండ్య ఎమ్మెల్యే రవికుమార్ గానిగ రష్మిక మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు పిలిచినా రాలేదని, కిరిక్ పార్టీతో తొలి అడుగులు తమ రాష్ట్రం నుంచే పడ్డాయనే విషయం మర్చిపోయిందని కస్సుబుస్సుమన్నారు.

కమిటీ తరఫున కొందరు పదిసార్లు కలిసి ఆహ్వానించారని అయినా సరే కర్ణాటక వచ్చేందుకు సమయం లేదని చెప్పి తప్పించుకుంది కాబట్టి ఆమెకు గుణపాఠం నేర్పించాలని పిలుపు ఇచ్చారు. మార్చి 1 నుంచి 8 దాకా జరుగుతున్న ఈ చిత్రోత్సవానికి శాండల్ వుడ్ నుంచి పేరున్న నటీనటులు ఎవరూ పెద్దగా పాల్గొనడం లేదు. దీనిపై డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ సైతం గుర్రుగా ఉన్నారు. వీళ్ళలో మార్పు రాకపోతే ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసంటూ చురకలు వేశారు. ఇప్పుడు జరుగుతున్నది 16వ ఫిలిం ఫెస్టివల్. ఎన్నో అవార్డు పొందిన గొప్ప సినిమాలు, డాక్యుమెంటరీలు ఇందులో ప్రదర్శిస్తున్నారు.

అయినా స్వంత ఇండస్ట్రీ నుంచే పెద్దగా సెలబ్రిటీలు రానప్పుడు ముంబై, హైదరాబాద్ షూటింగులతో బిజీగా ఉన్న రష్మిక మందన్న రాలేదని విమర్శించడం సబబు కాదని అభిమానుల వెర్షన్. మూడు బ్లాక్ బస్టర్ హిట్లు యానిమల్, పుష్ప 2, ఛావాతో దూసుకుపోతున్న ఛలో బ్యూటీకి ఈ ఏడాది ఇంకో మూడు నాలుగు రిలీజులు ఉండబోతున్నాయి. తెలుగు తమిళం కన్నా హిందీలో భారీ ఆఫర్లు దక్కించుకుంటున్న రష్మిక మందన్న మీద స్వరాష్ట్రంలో ఇలాంటి వ్యతిరేకతకు కారణం లేకపోలేదు. కన్నడ సినిమాలు చేసేంత టైం తనకు లేకపోవడమే. దీని గురించి ఏమైందా స్పందిస్తుందేమో చూడాలి.

This post was last modified on March 3, 2025 6:04 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago