అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్లో పవన్ కళ్యాణ్ నటించడం అధికారికం అయింది. అభిమానులకు పవన్ ఈ చిత్రం చేయడం పట్ల అసలు ఇష్టం లేకపోయినా కానీ ఎప్పటిలానే పవన్ అభిమానుల మనోగతాన్ని లెక్క చేయకుండా ఈ సినిమాను లైన్లో పెట్టేసాడు. కనీసం కాస్త పేరున్న దర్శకుడికి అయినా బాధ్యతలు ఇవ్వకుండా అనుభవం లేని సాగర్ చంద్రకు ఇవ్వడం కూడా ఫాన్స్ లో నిరుత్సాహాన్ని నింపింది.
ఇదిలావుంటే ఈ రీమేక్ న్యూస్ మొదట బయటకొచ్చింది లగాయతు రానా దగ్గుబాటి ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తాడని చెబుతూ వచ్చారు. ఒరిజినల్లో పృధ్వీరాజ్ చేసిన క్యారెక్టర్ పట్ల రానా దగ్గుబాటి చాలా ఆసక్తిగా వున్నాడని ఎన్నిసార్లు రాసినా అటు నిర్మాణ సంస్థ కానీ, ఇటు రానా కానీ కాదని ఖండించలేదు. పవన్కళ్యాణ్ చేయబోతున్న పాత్రకు బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ ఇలా చాలా పేర్లు వినిపించినా కానీ రానా మాత్రం కాన్స్టంట్గా వుండేవాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే అధికారికంగా ప్రకటించి మరో హీరో పేరు దాచిపెట్టారు.
పవన్కళ్యాణ్ పక్కన మరింత వెయిట్ వున్న యాక్టర్ కావాలని అనుకుంటున్నారా లేక పవన్ చేస్తున్నాడు కనుక ఇక మరో హీరో అవసరమే లేదని భావిస్తున్నారా అనేది ఇంకా తెలియదు.
This post was last modified on October 26, 2020 11:08 am
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…