గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ కు నిరాశే మిగిలింది. చెప్పుకోదగ్గ అంచనాల మధ్య వచ్చిన మజాకా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుండగా డబ్బింగ్ సినిమాలు శబ్దం, అగత్యా నిరాశ కలిగించాయి. ఇప్పుడు కొత్త ఫ్రైడే వైపు మూవీ లవర్స్ దృష్టి మళ్లుతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా పది దాకా రిలీజులు రంగం సిద్ధం చేసుకోవడం ఉత్సాహం కలిగించేదే అయినా దేని మీద విపరీతమైన అంచనాలు లేకపోవడం గమనార్షం. బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’ మూడు వారాలు ఆలస్యంగా తెలుగు డబ్బింగ్ రావడం ఏ మేరకు ఫలితం ఇస్తుందనే దాని మీద ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
మలయాళంలో ఇటీవలే విడుదలై విజయం సాధించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ని అదే పేరుతో అనువదించి థియేటర్లకు తీసుకొస్తున్నారు. కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన తారాగణం. జివి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన ‘కింగ్స్టన్’ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. అతను సంగీతం అందిస్తున్న రాబిన్ హుడ్ నితిన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. సముద్రపు హారర్ బ్యాక్ డ్రాప్ లో కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. కన్నడ డబ్బింగ్ ‘రాక్షస’తో పాటు ఇతర చిన్న సినిమాలు నారి, రారాజు, పౌరుషం, వైఫ్ అఫ్ అనిర్వేష్, శివంగి, నీకుకుళ్ళ, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వస్తున్నాయి.
ప్రమోషన్ల పరంగా ఎవరికి వారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ మొదటి రోజు టికెట్లు కొనిపించేలా ఎవరు చేయగలరనేది మాత్రం సస్పెన్సే. వీటికి తోడు మహేష్ బాబు – వెంకటేష్ రీ రిలీజ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు భారీ స్పందన కనిపిస్తోంది. బుకింగ్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. కొత్త సినిమాల కంటే దీని డామినేషన్ ఎక్కువగా ఉన్నా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. డ్రైగా ఉన్న టైంలో ఇన్నేసి సినిమాలు రావడం మంచిదే కానీ అంతో ఇంతో బజ్ ఉంటే తప్ప జనాలు కదిలే పరిస్థితి ఇప్పుడు లేదు. సో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వీటికి కీలకం. వారం పది రోజులు నిలబడాలంటే కావాల్సింది అదే.
This post was last modified on March 3, 2025 12:34 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…