‘బిగ్బాస్’ షోకి వెళ్లిన వారిలో చాలా మంది ఒక విషయం విస్మరిస్తుంటారు. ఈ షోలో ఫైనల్గా విజేత అయ్యేది ఒకరే. అందుకే ఎవరితోను ఓవర్గా అనుబంధం పెట్టుకోవడం, డిపెండ్ అవడం లేదా ఒకరిని గుడ్డిగా నమ్మేయడం చేయకూడదు. అందరినీ సరిగ్గా స్టడీ చేసిన దివి తన పక్కనే వున్న అమ్మ రాజశేఖర్ను స్టడీ చేయలేకపోయింది.
తనకు అతను మంచి చేస్తున్నాడనుకుని ప్రతి విషయంలో అతనిపై డిపెండ్ అవడం మొదలు పెట్టింది. అతడేమో ఆమె తన సపోర్ట్ తీసుకోవడాన్ని అలుసుగా తీసుకుని ‘గాళ్ఫ్రెండ్’, ‘ఫిగర్’ అంటూ వెనక మాట్లాడేవాడు. దాంతో ఎడిటర్లు దివి కనిపించిన ప్రతిసారీ అమ్మ రాజశేఖర్ని చూపించడం లేదా కపుల్ డాన్సులున్నపుడు ఇద్దరినీ కలిపి పంపించడం చేసారు. ఇది బయటకు ఎలా కనిపిస్తోందనేది దివికి తన ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు అర్థం కాలేదు. అందుకే బయటకు వెళుతూ బయట ఎవరెలా అనుకున్నా హౌస్లో నాకు నిజంగా మీరు అమ్మలాంటి వారు అని చెప్పుకుంది.
ఇక తన జర్నీ వీడియో చూడగానే దివికి మేటర్ బోధ పడిపోయింది. వంట వచ్చిన మగాళ్లు ఇష్టమని తాను అన్నప్పుడు అమ్మ రాజశేఖర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీవీలో చూసి… ‘ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారా?’ అంటూ ఆశ్చర్యపోయింది. ఇక ఇప్పుడు ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఈ మేటర్ క్లియర్ చేసుకోవడానికి కృషి చేయాలి. ఇదిలా వుంటే ఏనాడో అవుట్ కావాల్సిన అమ్మ రాజశేఖర్ కంటెస్టెంట్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నామినేషన్లు తప్పించుకుని ఇంకా హౌస్లో వున్నాడు. ఇకమీదట అయినా అతడిని నామినేట్ చేసి కంటెస్టెంట్లు బుర్ర వాడతారో లేదో చూడాలి.
This post was last modified on October 26, 2020 7:02 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…