‘బిగ్బాస్’ షోకి వెళ్లిన వారిలో చాలా మంది ఒక విషయం విస్మరిస్తుంటారు. ఈ షోలో ఫైనల్గా విజేత అయ్యేది ఒకరే. అందుకే ఎవరితోను ఓవర్గా అనుబంధం పెట్టుకోవడం, డిపెండ్ అవడం లేదా ఒకరిని గుడ్డిగా నమ్మేయడం చేయకూడదు. అందరినీ సరిగ్గా స్టడీ చేసిన దివి తన పక్కనే వున్న అమ్మ రాజశేఖర్ను స్టడీ చేయలేకపోయింది.
తనకు అతను మంచి చేస్తున్నాడనుకుని ప్రతి విషయంలో అతనిపై డిపెండ్ అవడం మొదలు పెట్టింది. అతడేమో ఆమె తన సపోర్ట్ తీసుకోవడాన్ని అలుసుగా తీసుకుని ‘గాళ్ఫ్రెండ్’, ‘ఫిగర్’ అంటూ వెనక మాట్లాడేవాడు. దాంతో ఎడిటర్లు దివి కనిపించిన ప్రతిసారీ అమ్మ రాజశేఖర్ని చూపించడం లేదా కపుల్ డాన్సులున్నపుడు ఇద్దరినీ కలిపి పంపించడం చేసారు. ఇది బయటకు ఎలా కనిపిస్తోందనేది దివికి తన ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు అర్థం కాలేదు. అందుకే బయటకు వెళుతూ బయట ఎవరెలా అనుకున్నా హౌస్లో నాకు నిజంగా మీరు అమ్మలాంటి వారు అని చెప్పుకుంది.
ఇక తన జర్నీ వీడియో చూడగానే దివికి మేటర్ బోధ పడిపోయింది. వంట వచ్చిన మగాళ్లు ఇష్టమని తాను అన్నప్పుడు అమ్మ రాజశేఖర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీవీలో చూసి… ‘ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారా?’ అంటూ ఆశ్చర్యపోయింది. ఇక ఇప్పుడు ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఈ మేటర్ క్లియర్ చేసుకోవడానికి కృషి చేయాలి. ఇదిలా వుంటే ఏనాడో అవుట్ కావాల్సిన అమ్మ రాజశేఖర్ కంటెస్టెంట్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ నామినేషన్లు తప్పించుకుని ఇంకా హౌస్లో వున్నాడు. ఇకమీదట అయినా అతడిని నామినేట్ చేసి కంటెస్టెంట్లు బుర్ర వాడతారో లేదో చూడాలి.
This post was last modified on October 26, 2020 7:02 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…