ఒక కొత్త సినిమా టీవీ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే రోజులు ఏనాడో పోయాయి కానీ జీ ఛానల్ వేసిన తెలివైన ఎత్తుగడ వల్ల నిన్న సంక్రాంతికి వస్తున్నాంకి భారీ స్పందన వచ్చింది. శాటిలైట్ టెలికాస్ట్, ఓటిటి రెండూ ఒకే రోజు ఒకే సమయంలో మొదలుపెట్టాలనే ఆలోచన బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చిందని ప్రాధమిక సమాచారం. టిఆర్పి రేటింగులు గట్రా ఇంకో వారం ఆగితే తెలుస్తాయి కానీ గత రెండు మూడేళ్ళలో రాని నెంబర్లు వెంకటేష్ నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర మూడు వందల కోట్లు కొల్లగొట్టినట్టే టీవీ అంకెల్లోనూ సంచలనాలు అందుకోవడం పక్కా.
ఇదిలా ఉండగా ఓటిటి వెర్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం నిడివి 2 గంటల 16 నిముషాలు ఉంది. థియేట్రికల్ ప్లస్ టీవీ వెర్షన్ లెన్త్ 2 గంటల 24 నిముషాలు. అంటే ఎనిమిది నిముషాలు కట్ అయ్యిందని ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. పాటలు పోలేదు కానీ ఏ సీన్లు పోయాయోనని టెన్షన్ పడ్డారు. వాస్తవం ఏంటంటే అసలు ఎలాంటి కట్స్ లేవు. అయినా తేడా రావడానికి కారణముంది. ఓటిటిలో స్ట్రీమింగ్ చేసిన వెర్షన్ 24 FPS (ఫ్రేమ్స్ పర్ సెకండ్) ఉంది. కానీ ఉండాల్సింది 25 FPS. అంటే ఒక్క సెకనుకు ఎంత కదలిక ఉండాలనేది సెట్ చేయడాన్నే ఎఫ్పిఎస్ అంటారు. దాని వల్ల మూమెంట్ లో వ్యత్యాసం వచ్చి నిడివి మారిపోతుంది.
సో సంక్రాంతికి వస్తున్నాంలో ఏవో కట్స్ జరిగాయనే టెన్షన్ అక్కర్లేదు. 2025 తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజు బ్యానర్ కు కంబ్యాక్ ఇచ్చింది. ఎన్నో వరస ఫ్లాపులతో పాటు పండక్కు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గాయాన్ని కూడా ఇదే మాన్పింది. ఎల్లుండి యాభై రోజుల పండగ చేయబోతున్నారు. సుమారు 40కి పైగా సెంటర్లలో ఫిఫ్టీ డేస్ నమోదైనట్టుగా సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ మూవీకి ఇంత రికార్డులు రావడం చిన్న విషయం కాదు. ఈ విజయం చూశాకే వెంకటేష్ తన తదుపరి సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటూ వినోదానికి పెద్ద పీఠ వేయాలని నిర్ణయించుకున్నారు.
This post was last modified on March 2, 2025 1:14 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…