ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా మార్కెట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం పెద్ద సవాలుగా మారిపోయింది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న నేపథ్యంలో పబ్లిసిటీ అన్నది చాలా కీలకం అయింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు ఫిలిం మేకర్స్. ఏదో ఒక కాంపిటీషన్ లాంటిది పెట్టి బహుమతులు ప్రకటించి ప్రేక్షకుల్లో సినిమా గురించి చర్చ జరిగేలా చేయడం అన్నది ఎప్పట్నుంచో ఉన్న స్ట్రాటజీనే.
ఇప్పటికీ దాన్ని అనుసరిస్తున్న వాళ్లు ఉన్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘దిల్ రుబా’ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఇదే రూటును అనుసరిస్తున్నాడు. ‘ప్లాట్ గెస్ కొట్టు.. బైక్ పట్టు’ అంటూ అతను ఒక ఆసక్తికర ప్రమోషనల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు.
ఈ సినిమా కథ ఏంటన్నది ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రోమోల ద్వారా తాము చెప్పకనే చెప్పేశామని.. ఈ నేపథ్యంలో ప్లాట్ పాయింట్ ఏంటన్నది ప్రేక్షకులు కని పెట్టి చెప్పాలని కిరణ్ పిలుపునిచ్చాడు. తమ క్రియేటివిటీకి ఆడియన్స్ పదును పెట్టాలని.. ఎవరు సృజనాత్మకంగా ఆలోచించి ప్లాట్ పాయింట్ చెబుతారో వారికి బైక్ గిఫ్టుగా ఇస్తామని కిరణ్ తెలిపాడు. ఐతే కిరణ్ ఇవ్వబోతున్నది మామూలు బైక్ కాదు. ఈ సినిమా కోసమే ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన అల్ట్రా మోడర్న్ బైక్. దాన్ని వీడియోలో కిరణ్ చూపించాడు కూడా. అది చూస్తే ఎవరికైనా టెంప్టేషన్ రావడం గ్యారెంటీ.
కథ సరిగ్గా అంచనా వేసిన వారికి కేవలం ఈ బైక్ గిఫ్టుగా ఇవ్వడమే కాదు.. ఆ వ్యక్తితో కలిసి అదే బైక్ మీద ‘దిల్ రుబా’ థియేటర్కు వెళ్లి వారితో కలిసి సినిమా కూడా చూస్తానని కిరణ్ హామీ ఇచ్చాడు. విశ్వకరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘దిల్ రుబా’లో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on March 2, 2025 1:19 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…