డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాలా మొదలై పెద్ద రేంజికి వెళ్లిపోయిందది. ఇక దీని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ గత ఏడాది వేసవిలో విడుదలై ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ కూడా రాబోతున్నట్లు అప్పుడే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో కొంత సస్పెన్స్ ఉండేది. ఇప్పుడా విషయంలో క్లారిటీ వచ్చేసింది. టిల్లు క్యూబ్ను ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించబోతున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. ఇది టిల్లు అభిమానులను బాగా ఎగ్జైట్ చేసే విషయమే.
డీజే టిల్లు మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా.. సీక్వెల్కు వచ్చేసరికి దర్శకుడు మారిపోయాడు. మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడు మూడో పార్ట్ కళ్యాణ్ శంకర్ చేతికి వచ్చింది. ఇంతకుముందు ఇద్దరు దర్శకులకు పెద్దగా గుర్తింపు లేదు. అంతా సిద్ధు జొన్నలగడ్డనే చూసుకున్నాడనే పేరొచ్చింది. రైటింగ్, మేకింగ్లో అతడి ఇన్వాల్వ్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఐతే కళ్యాణ్ తక్కువవాడేమీ కాదని ‘మ్యాడ్’ సినిమాతోనే రుజువైంది.
తన సెన్సాఫ్ హ్యూమరే వేరు. మ్యాడ్ స్క్వేర్ టీజర్లోనూ అది కనిపించింది. సిద్ధు రైటింగ్ టాలెంట్కి కళ్యాణ్ ప్రతిభ కూడా తోడైతే ఔట్ పుట్ వేరే లెవెల్లో ఉంటుందని ఆశించవచ్చు. కామెడీ పీక్స్కు వెళ్లడం గ్యారెంటీ. కాబట్టి ఈ సినిమాకు హైప్ కూడా మామూలుగా ఉండబోదు. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో నటిస్తున్న సిద్ధు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘టిల్లు క్యూబ్’ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈలోపు కళ్యాణ్, అతను కలిసి స్క్రిప్టు రెడీ చేయబోతున్నారు.
This post was last modified on March 1, 2025 3:03 pm
ఏపీకి చెందిన క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల మరణంపై నెలకొన్న అస్పష్టతకు తెర పడిపోయింది. ఈ మేరకు ఏలూరు రేంజి…
ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…
ఏపీలో రాముడి తరహా రామరాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రామరాజ్యం అంటే.. ఏపీ సమగ్ర అభివృద్ధి…
తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.…
హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…
సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…