డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాలా మొదలై పెద్ద రేంజికి వెళ్లిపోయిందది. ఇక దీని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ గత ఏడాది వేసవిలో విడుదలై ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ కూడా రాబోతున్నట్లు అప్పుడే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో కొంత సస్పెన్స్ ఉండేది. ఇప్పుడా విషయంలో క్లారిటీ వచ్చేసింది. టిల్లు క్యూబ్ను ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించబోతున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. ఇది టిల్లు అభిమానులను బాగా ఎగ్జైట్ చేసే విషయమే.
డీజే టిల్లు మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా.. సీక్వెల్కు వచ్చేసరికి దర్శకుడు మారిపోయాడు. మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడు మూడో పార్ట్ కళ్యాణ్ శంకర్ చేతికి వచ్చింది. ఇంతకుముందు ఇద్దరు దర్శకులకు పెద్దగా గుర్తింపు లేదు. అంతా సిద్ధు జొన్నలగడ్డనే చూసుకున్నాడనే పేరొచ్చింది. రైటింగ్, మేకింగ్లో అతడి ఇన్వాల్వ్మెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఐతే కళ్యాణ్ తక్కువవాడేమీ కాదని ‘మ్యాడ్’ సినిమాతోనే రుజువైంది.
తన సెన్సాఫ్ హ్యూమరే వేరు. మ్యాడ్ స్క్వేర్ టీజర్లోనూ అది కనిపించింది. సిద్ధు రైటింగ్ టాలెంట్కి కళ్యాణ్ ప్రతిభ కూడా తోడైతే ఔట్ పుట్ వేరే లెవెల్లో ఉంటుందని ఆశించవచ్చు. కామెడీ పీక్స్కు వెళ్లడం గ్యారెంటీ. కాబట్టి ఈ సినిమాకు హైప్ కూడా మామూలుగా ఉండబోదు. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో నటిస్తున్న సిద్ధు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘టిల్లు క్యూబ్’ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈలోపు కళ్యాణ్, అతను కలిసి స్క్రిప్టు రెడీ చేయబోతున్నారు.
This post was last modified on March 1, 2025 3:03 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…