అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. తొలి మూడు సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న అఖిల్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు వాళ్లు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సింది హీరో మాత్రమే కాదు.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా.
తొలి సినిమా ‘బొమ్మరిల్లు’తో తిరుగులేని విజయాన్నందుకుని.. రెండో సినిమా ‘పరుగు’తోనూ సక్సెస్ చూసిన భాస్కర్ మూడో సినిమా ‘ఆరెంజ్’తో మాత్రం దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సినిమా డిజాస్టర్ అయి నిర్మాత నాగబాబును ముంచేసింది. దీంతో భాస్కర్ కెరీర్ తల్లకిందులైంది. ఒంగోలు గిత్త, ‘బెంగళూరు డేస్’ తమిళ రీమేక్లతో ఇంకా గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇంత కాలానికి మళ్లీ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో అఖిల్ హీరోగా సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
ఇప్పటిదాకా రిలీజైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రోమోలు పాజిటివ్ ఫీల్నే ఇచ్చాయి. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది కూడా బాగానే అనిపించింది. కానీ ఆ టీజర్ చూసిన జనాలకు ‘ఆరెంజ్’ గుర్తు వచ్చి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. అందులో ప్రేమ, పెళ్లి మీద చాలా పెద్ద డిస్కషనే ఉంటుంది. కానీ అది ఆశించినంత వినోదాత్మకంగా లేకపోవడం, చర్చ మరీ లోతుల్లోకి వెళ్లిపోయి విసుగు తెప్పించేయడంతో సినిమాకు దారుణమైన ఫలితం వచ్చింది.
ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ పెళ్లి మీద పెద్ద డిస్కషనే పెట్టినట్లున్నాడు భాస్కర్. పెళ్లి మీద యువతీ యువకుల అభిప్రాయాల చుట్టూనే ఈ టీజర్ నడిచింది. హీరో హీరోయిన్లిద్దరూ విరుద్ధమైన భావాలతో కనిపించారు. టీజర్లో ఇంకేమీ చూపించకుండా ఈ అభిప్రాయాలు, భావాల చుట్టూనే తిప్పడంతో భాస్కర్ మళ్లీ లోతైన డిస్కషన్లోకి వెళ్లిపోతాడా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఒకసారి దెబ్బ తిన్నాక అతను మళ్లీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేం. పైగా ఇక్కడ అరవింద్ ఉన్నాడు. అందులోనూ అఖిల్ కెరీర్కు ఇది చాలా ముఖ్యమైన సినిమా. కాబట్టి ‘ఆరెంజ్’ తరహా కథనే వినోదాత్మకంగా చెప్పి మెప్పిస్తాడేమో చూడాలి భాస్కర్.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…