నందమూరి కళ్యాణ్ రామ్ తెర మీద కనిపించి ఏడాది దాటేసింది. 2023 డిసెంబర్ లో డెవిల్ రిలీజయ్యాక మళ్ళీ దర్శనం లేదు. దీంతో పాటు అదే ఏడాది అమిగోస్ రూపంలో మొత్తం రెండు ఫ్లాపులు చవి చూసి కొంత బ్రేక్ తీసుకున్నాడు. అయితే తన ఇరవై ఒకటవ సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సంవత్సరానికి పైగానే నిర్మాణంలో ఉంది. పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. మెరుపు, రుద్ర అంటూ ఫిలిం నగర్ లో మాట్లాడుకున్నారు కానీ ఫైనల్ గా ఏది ఫిక్స్ చేస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
షూట్ చివరి దశకు చేరుకుంది. మేజర్ ఫేమ్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ హీరోయిన్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నటించను అని చెప్పిన రాములమ్మ ఈ కళ్యాణ్ రామ్ కథ విపరీతంగా నచ్చడం వల్ల ఓకే చెప్పారు. పైగా కర్తవ్యం పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్రని రీ క్రియేట్ చేయడంతో ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చడం మరో అట్రాక్షన్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు సరైన రీతిలో ప్రమోషన్ చేసుకుంటే ఖచ్చితంగా అంచనాలు రేపొచ్చు.
ఆలస్యానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఓటిటి డీల్ తో పాటు వేసవి మొత్తం పెద్ద సినిమాలతో రిలీజ్ డేట్లు లాకైపోవడంతో సరైన తేదీ కోసం చూస్తున్నారట. దేవరతో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాక అన్న కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చాలా ముఖ్యమైన సందర్భాల్లో తప్ప కళ్యాణ్ రామ్ బయట కనిపించడం కూడా తగ్గించేశాడు. బింబిసార 2 అనౌన్స్ చేసి నెలలు గడిచిపోయినా ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ప్రధానంగా ఈ రెండే లైనప్ లో ఉన్నాయి. తారక్ వార్ 2 వచ్చేలోపే కళ్యాణ్ రామ్ ది రిలీజవ్వాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on February 28, 2025 8:42 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…