గతంలో జరిగిన కొన్ని షాకింగ్ సంఘటనలు దర్శకులు, హీరోలు వాళ్ళుగా పంచుకుంటేనే తప్ప బయట ప్రపంచానికి తెలిసి రావు. అలాంటి వాటిలో ఇదొకటి. మార్చి 7 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ కాబోతున్న సందర్భం పురస్కరించుకుని కొన్ని పాత వీడియోలు ప్రచారంలోకి వచ్చి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అలాంటి సీక్రెట్ ఒకటి పంచుకున్నారు. ఇద్దరు అగ్ర హీరోలతో ఒక ఫ్యామిలీ మూవీని ప్లాన్ చేశాక, కీలకమైన రేలంగి మావయ్య క్యారెక్టర్ ని అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీకాంత్ నిర్మాత దిల్ రాజుగారినో కోరిక కోరారు.
అదే సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలవడం. మంచికి ప్రతిరూపంగా ఉండే రేలంగి మావయ్యగా రజని అయితే బాగుంటుందని అడిగారు. శంకర్ రికమండేషన్ ద్వారా అపాయింట్ మెంట్ దొరికింది. రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఆయన్నుకలవడానికి శ్రీకాంత్ అడ్డాల చెన్నై వెళ్లిపోయారు. ముందు మేకప్ లేకుండా వచ్చిన రజని చూసి ఠక్కున గుర్తుపట్టలేదు. కొన్ని క్షణాల్లో తేరుకుని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముప్పావు గంట నరేషన్ ఇచ్చారు. బాగా నచ్చేసింది. నన్నే ఎందుకు అనుకుంటున్నారని కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాని ఆ టైంలో అనారోగ్యం కారణంగా చేయలేనని రజని నిస్సహాయత వ్యక్తం చేయడం అసలు క్లైమాక్స్.
తర్వాత ప్రకాష్ రాజ్ రావడం, రేలంగి మావయ్యగా జీవించడం జరిగిపోయాయి. ఒకవేళ టైం బాగుండి నిజంగానే వెంకటేష్, మహేష్ బాబులకు తండ్రిగా రజనీకాంత్ నటించి ఉంటే ఎలా ఉండేదని ఊహించుకుంటేనే మతి పోతోంది కదూ. అయితే ఇప్పుడు మనం చూసిన వెర్షన్ కాకుండా ఆయన ఇమేజ్ కు తగ్గట్టు కొన్ని మార్పులైతే చేసి ఉండేవాళ్ళు. ఏదైతేనేం తెరమీద ఒక అరుదైన ట్రిపుల్ కలయికని ఆడియన్స్ మిస్సయ్యారు. ఇదంతా అప్పుడెప్పుడో ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల పంచుకున్నారు. ఇంకో పది రోజుల్లో ఇలాంటి కబుర్లు ఇంకెన్ని వస్తాయోనని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
This post was last modified on February 27, 2025 11:16 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…