అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన కుబేర విడుదల తేదీ వచ్చేసింది. జూన్ 20 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో మెయిన్ హీరో ధనుష్ అయినప్పటికీ పాత్ర పరంగా నాగార్జునకు సైతం చాలా ప్రాధాన్యం ఉండటంతో దీన్నీ మల్టీ స్టారర్ గానే పరిగణించాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మనీ క్రైమ్ డ్రామాలో రష్మిక మందన్న హీరోయిన్ కాగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. కాంబినేషన్ల పరంగా ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇక తెలివైన ఎత్తుగడ ఏంటో చూద్దాం.
వేసవి సీజన్ ముగింపులో జూన్ చాలా కీలకం. ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమా ఆ నెలను లాక్ చేసుకోలేదు. చిరంజీవి విశ్వంభరని అనుకున్నారు కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షూటింగ్ పూర్తయ్యి గుమ్మడికాయ కొట్టేదాకా డేట్ ఆశించలేం. రవితేజ మాస్ జాతర సైతం ఇలాంటి మీమాంసనే ఎదురుకుంటోంది. జూన్ 5 కమల్ హాసన్ తగ్ లైఫ్ ఒక్కటే ఇప్పటిదాకా అఫీషియల్ గా అనౌన్స్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీ. ఆ తర్వాతి వారం ఖాళీగానే ఉంది. జూన్ చివరి వారం సైతం ఎవరూ ఎంచుకోలేదు. సో కుబేర కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఓపెనింగ్స్ తో పాటు మంచి రన్ పుష్కలంగా దక్కుతుంది.
ఇంకో ఇంకో కారణం కూడా ఉంది. ధనుష్ నటించి దర్శకత్వం వహించిన ఇడ్లి కడాయ్ ఏప్రిల్ 10 రావాలి. ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యే పక్షంలో మే అనుకుంటున్నారు. అదే జరిగితే తన రెండు సినిమాల మధ్య కనీసం నెల రోజుల పైన గ్యాప్ లేకపోతే థియేటర్స్ పరంగా ఇబ్బంది వస్తుందని భావించి కుబేర నిర్మాతలకు ఆ మేరకు సూచనలు చేశాడట. ఎలాగూ పోస్ట్ ప్రొడక్షన్ కి టైం పడుతోంది కాబట్టి శేఖర్ కమ్ముల సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. తండేల్ సూపర్ హిట్ తో నాగచైతన్యకు వంద కోట్ల గ్రాస్ వచ్చిందని ఆనందంలో ఉన్న ఫ్యాన్స్ కు నెక్స్ట్ కుబేర ఎలాంటి ఫలితం ఇస్తుందో మూడున్నర నెలల్లో తేలనుంది.
This post was last modified on February 27, 2025 10:33 am
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…