టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న కుటుంబాల్లో నందమూరి వారిది ఒకటి. ఐతే ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఆయన అందరివాడుగా ఉండేవాడు. కానీ తర్వాతి తరం మాత్రం ఇండస్ట్రీలో మిగతా వాళ్లతో అంత సన్నిహితంగా మెలగలేపోయింది. ముఖ్యంగా ఎన్టీఆర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. తాను వేరు, ఇండస్ట్రీలో మిగతా వాళ్లు వేరు అన్నట్లుగా తన దారిలో తాను వెళ్లిపోతూ ఉంటాడు. చిరంజీవి లాంటి కొందరు తనకు క్లోజ్ అని బాలయ్య చెబుతాడు కానీ.. నిజానికి అంత సన్నిహితంగా కనిపించిన సందర్భాలు అరుదు.
ఇంతకుముందైనా బాలయ్య ఇండస్ట్రీ జనాలతో అంతో ఇంతో కలిసేవాడు. కానీ ఈ మధ్య పూర్తిగా అందరితోనూ సంబంధాలు తెగిపోయాయా అన్నట్లు కనిపిస్తున్నాయి పరిణామాలు. ఈ మధ్య కరోనా టైంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పెద్దల్ని సినీ ప్రముఖులు కలిసినపుడు తనను పిలవకపోవడంపై బాలయ్య అలిగిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ దెబ్బతో ఇండస్ట్రీకి, బాలయ్యకు మధ్య అంతరం మరింత పెరిగినట్లే ఉంది. తాజాగా బాలయ్య మధ్యలో ఆగిపోయిన తన కలల ప్రాజెక్టు ‘నర్తనశాల’ కోసం దశాబ్దంన్నర కిందట తెరకెక్కించిన సన్నివేశాలకు కొన్ని విశేషాలు జోడించి శ్రేయాస్ ఈటీలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పూర్తి స్థాయి సినిమా కాకపోయినా బాలయ్యకు ప్రతిష్టాత్మకమైందే. ఆయన దర్శకత్వం వహించిన సినిమా నుంచి ఫుటేజీ తీసి ఇలా దసరా సందర్భాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేస్తే సినీ పరిశ్రమ నుంచి కనీస స్పందన లేదు.
దీన్ని ఇండస్ట్రీ జనాలెవ్వరూ ఎండోర్స్ చేయలేదు. దాని మీద ఒక కామెంట్ చేయలేదు. శుభాకాంక్షలు లేవు. అభినందనలు లేవు. అసలెవ్వరూ దీని ఊసే ఎత్తట్లేదు. నారా రోహిత్ ఒక్కడు ఒక ట్వీట్ వేశాడు తప్పితే జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించలేదు. బాలయ్య తోటి సీనియర్లకూ ఇది పట్టలేదు. బాలయ్యతో వ్యవహారమే మనకొద్దు అన్నట్లుగా అందరూ గప్చుప్ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on October 25, 2020 8:09 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…