టాలీవుడ్లో ఒక హీరోయిన్ వరుసగా రెండు మూడు హిట్లు కొట్టిందంటే ఆమె రేంజే మారిపోతుంది. పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చి పడిపోతాయి. రష్మిక మందన్నా సైతం ఇలాగే టాలీవుడ్లో శుభారంభం చేసి పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ‘ఛలో’ లాంటి చిన్న సినిమాతో పరిచయం అయినప్పటికీ చాలా త్వరగా ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు భారీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించిన ఆమె.. అల్లు అర్జున్కు జోడీగా ‘పుష్ప’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రష్మిక వరుసగా ఆ రేంజ్ హీరోలతోనే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె మీడియం రేంజ్ సినిమాల్లోనూ నటించడానికి రెడీగా ఉండటం విశేషమే.
‘సరిలేరు..’ చేస్తున్న సమయంలోనే నితిన్ సరసన ‘భీష్మ’లో నటించిన రష్మిక.. బన్నీతో ‘పుష్ప’కు రెడీ అవుతున్న సమయంలోనే మరో మీడియం రేంజ్ సినిమాకు ఓకే చెప్పింది. ఆమె శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దసరా రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇంతకుముందు వెంకటేష్తో కిషోర్ చేయాలనుకున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమానే శర్వాతో చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదెంత వరకు నిజమో చూడాలి.
‘పడి పడి లేచె మనసు’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో జోరుమీదున్న శర్వాకు ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రస్తుతం అతను ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ సినిమాకు కమిటయ్యాడు. దాంతో పాటే ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’లోనూ నటించనున్నాడు. ఈ టైటిల్ను బట్టి చూస్తే సినిమాలో రష్మిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండేలా కనిపిస్తోంది.
This post was last modified on October 24, 2020 3:37 pm
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…
చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…