టాలీవుడ్లో ఒక హీరోయిన్ వరుసగా రెండు మూడు హిట్లు కొట్టిందంటే ఆమె రేంజే మారిపోతుంది. పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చి పడిపోతాయి. రష్మిక మందన్నా సైతం ఇలాగే టాలీవుడ్లో శుభారంభం చేసి పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ‘ఛలో’ లాంటి చిన్న సినిమాతో పరిచయం అయినప్పటికీ చాలా త్వరగా ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు భారీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించిన ఆమె.. అల్లు అర్జున్కు జోడీగా ‘పుష్ప’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రష్మిక వరుసగా ఆ రేంజ్ హీరోలతోనే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె మీడియం రేంజ్ సినిమాల్లోనూ నటించడానికి రెడీగా ఉండటం విశేషమే.
‘సరిలేరు..’ చేస్తున్న సమయంలోనే నితిన్ సరసన ‘భీష్మ’లో నటించిన రష్మిక.. బన్నీతో ‘పుష్ప’కు రెడీ అవుతున్న సమయంలోనే మరో మీడియం రేంజ్ సినిమాకు ఓకే చెప్పింది. ఆమె శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దసరా రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇంతకుముందు వెంకటేష్తో కిషోర్ చేయాలనుకున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమానే శర్వాతో చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదెంత వరకు నిజమో చూడాలి.
‘పడి పడి లేచె మనసు’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో జోరుమీదున్న శర్వాకు ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రస్తుతం అతను ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ సినిమాకు కమిటయ్యాడు. దాంతో పాటే ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’లోనూ నటించనున్నాడు. ఈ టైటిల్ను బట్టి చూస్తే సినిమాలో రష్మిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండేలా కనిపిస్తోంది.
This post was last modified on October 24, 2020 3:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…