టాలీవుడ్లో ఒక హీరోయిన్ వరుసగా రెండు మూడు హిట్లు కొట్టిందంటే ఆమె రేంజే మారిపోతుంది. పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చి పడిపోతాయి. రష్మిక మందన్నా సైతం ఇలాగే టాలీవుడ్లో శుభారంభం చేసి పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ‘ఛలో’ లాంటి చిన్న సినిమాతో పరిచయం అయినప్పటికీ చాలా త్వరగా ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు భారీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించిన ఆమె.. అల్లు అర్జున్కు జోడీగా ‘పుష్ప’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రష్మిక వరుసగా ఆ రేంజ్ హీరోలతోనే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె మీడియం రేంజ్ సినిమాల్లోనూ నటించడానికి రెడీగా ఉండటం విశేషమే.
‘సరిలేరు..’ చేస్తున్న సమయంలోనే నితిన్ సరసన ‘భీష్మ’లో నటించిన రష్మిక.. బన్నీతో ‘పుష్ప’కు రెడీ అవుతున్న సమయంలోనే మరో మీడియం రేంజ్ సినిమాకు ఓకే చెప్పింది. ఆమె శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దసరా రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇంతకుముందు వెంకటేష్తో కిషోర్ చేయాలనుకున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమానే శర్వాతో చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదెంత వరకు నిజమో చూడాలి.
‘పడి పడి లేచె మనసు’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో జోరుమీదున్న శర్వాకు ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రస్తుతం అతను ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ సినిమాకు కమిటయ్యాడు. దాంతో పాటే ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’లోనూ నటించనున్నాడు. ఈ టైటిల్ను బట్టి చూస్తే సినిమాలో రష్మిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండేలా కనిపిస్తోంది.
This post was last modified on October 24, 2020 3:37 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…