బిగ్బాస్ 18 విజేతగా నిలిచిన కరణ్ వీర్ మెహ్రా, ట్రోఫీతో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. కానీ షో ముగిసిన నెలరోజులైనా ఆ ప్రైజ్ మనీ తనకు ఇంకా రాలేదని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. ‘భార్తీ టీవీ’లో పాల్గొన్న కరణ్, బిగ్బాస్ తర్వాత జరుగుతున్న పరిణామాలను వివరించారు. కరణ్ మాట్లాడుతూ, బిగ్బాస్ ద్వారా తన వ్యక్తిత్వం ప్రేక్షకులకు బాగా నచ్చిందని, గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడా కాదని చెప్పారు.
ఇంట్లో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలని అనుకున్నా.. గెలవాలన్న ఆలోచన లేకుండా ముందుకు సాగానని చెబుతూ.. తన సాదాసీదా స్వభావమే అభిమానులను ఆకర్షించిందని, బిగ్బాస్ తర్వాత ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రేమ తనను ఆశ్చర్యపరుస్తోందని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, ప్రత్యేకంగా ఇచ్చే ఆశీస్సులు మరింత ఉత్సాహాన్నిస్తోందని తెలిపారు.
ప్రైజ్ మనీ రావడం ఆలస్యం అవుతోందని చెబుతూ, “ఖత్రోం కే ఖిలాడీ 14 నుంచి గెలిచిన డబ్బు రావడం జరిగింది. నేను గెలుచుకున్న కారు కూడా కొద్ది రోజుల్లో డెలివరీ అవుతోంది. కానీ బిగ్బాస్ ప్రైజ్ మనీ ఇంకా రాలేదు” అని కరణ్ అన్నారు. కలర్స్ ఛానెల్ తన కెరీర్లో కీలక భూమిక పోషించిందని, ఇలాంటి షోలతో నటులకే కాకుండా వారి వ్యక్తిత్వానికి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు.
కరణ్ బిగ్బాస్ 18 ఫైనల్లో వివియన్ డీసేనా, రాజత్ దలాల్లను ఓడించి ట్రోఫీ గెలుచుకున్నారు. ప్రైజ్ మనీ రావగానే తన సిబ్బంది పిల్లల విద్య కోసం ఖర్చు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కరణ్, ఇంకా ఆ డబ్బు అందకపోవడంతో అభిమానులు షాక్లో ఉన్నారు. ప్రైజ్ మనీ ఆలస్యం కావడం కలర్స్ ఛానెల్పై కూడా విమర్శలు రేపుతోంది.
This post was last modified on February 24, 2025 4:50 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…